ఇక టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. ఈ కుర్ర హీరో ఇటీవలే ఓ ఇంటివాడైన విషయం అందరికి తెలిసిందే. అయితే సోమవారం కార్తీక పూర్ణమి కావడంతో గుడిలో దీపాలను వెలిగించాడు నిఖిల్. సికింద్రాబాద్ స్కందగిరిలోని కార్తికేయ స్వామి వారి దేవాలయంలో కార్తీక పౌర్ణమి సందర్బంగా 365 దీపాలను వెలిగించాడు నిఖిల్. కుటుంబ సభ్యులతో ఆలయానికి వెళ్లిన నిఖిల్ మిగిలిన భక్తులతో పాటు దేవాలయంలో దీపాలను వెలిగించాడు.
ఇక ప్రతి ఏడాది తాను ఇలా దీపాలను వెలిగిస్తానంటూ చెప్పుకొచ్చాడు ఈ యాంగ్ హీరో. ప్రతి ఏడాది కార్తీక మాసంలో ఏదో ఒక రోజున కార్తికేయ స్వామికి దీపాలను వెలిగించడం ఆనవాయితీగా వస్తుందని నిఖిల్ తెలిపారు. ప్రస్తుతం నిఖిల్ చేతిలో మూడు సినిమాలు ఉన్నాయి. వీటిలో ‘కార్తికేయ’ సీక్వెల్ పైన మంచి బజ్ ఏర్పడింది. గతంలో వచ్చిన ‘కార్తికేయ’ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంది. దాంతో ఈ సీక్వెల్ పైన ప్రత్యేక దృష్టిపెట్టాడు నిఖిల్. మరో రెండు సినిమాలను వచ్చే ఏడాది సెట్స్ పైకి తీసుకెళ్లనున్నాడు ఈ కుర్రహీరో. చందు మొండేటి దర్శకత్వంలోనే రెండో భాగం తెరకెక్కుతోంది. మొదటి భాగానికి మించిన స్థాయిలో ఈ సినిమా ఉంటుందని నమ్మకంగా చెబుతున్నారు. మరి నిఖిల్ కు ఆ సుబ్రహ్మేశ్వర స్వామి అనుగ్రహం నిండుగా మెండుగా దక్కి ఆ సినిమా భారీ హిట్టవ్వాలని కోరుకుందాం.