సాయి ధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ నటిస్తున్న మొదటి మూవీ ‘ఉప్పెన’ విడుదల కాకుండానే ఆ మూవీ పై భారీ అంచనాలు పెరిగిపోతున్నాయి. వాస్తవానికి ఈ మూవీని ఒక ప్రముఖ ఓటీటీ సంస్థ విడుదల చేస్తానని ముందుకు వచ్చినా ఈ మూవీ పై ఉన్న నమ్మకంతో ఈ మూవీ నిర్మాతలు మైత్రీ మూవీ మేకర్స్ తమకు వచ్చిన భారీ ఆఫర్స్ ను కూడ రిజెక్ట్ చేసి ధియేటర్ రిలీజ్ గురించి ఆశక్తిగా ఎదురు చూస్తున్నారు.


అన్నీ అనుకున్నవి అనుకున్నట్లుగా జరిగితే ఈ మూవీ సంక్రాంతికి రిలీజ్ అయ్యే ఆస్కారం ఉంది. ఇది ఇలా ఉండగా ఈ మూవీలో నటిస్తున్న వైష్ణవ్ తేజ్ కీర్తి శెట్టి లకు ఈ మూవీ విడుదల కాకుండానే భారీ క్రేజ్ ఏర్పడి వరస పెట్టి అవకాశాలు వస్తున్నాయి. ఇప్పటికే సోషల్ మీడియాలో యూత్ కు క్రేజీ బ్యూటీగా మారిన కీర్తి శెట్టి కి టాలీవుడ్ లో వరస పెట్టి అవకాశాలు వస్తున్నాయి.


అయితే కీర్తి తన దగ్గరకు వస్తున్న దర్శక నిర్మాతలకు తన మొదటి సినిమా విడుదల కాకుండానే చుక్కలు చూపెడుతున్నట్లు టాక్. తాను హీరోయిన్ గా నటించాలి అంటే 75 లక్షల పారితోషికం కీర్తి డిమాండ్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనితో చాలామంది దర్శక నిర్మాతలు షాక్ అవ్వడమే కాకుండా ఇప్పటికే అనేకమంది హీరోలతో హిట్ సినిమాలలో నటించిన రాశి ఖన్నా 75 లక్షల పారితోషికం చేరుకొని నేపధ్యంలో ఏ ధైర్యంతో కీర్తి 75 లక్షలు డిమాండ్ చేస్తోంది అంటూ ఇండస్ట్రీ వర్గాలు ఆశ్చర్యపోతున్నా యి.


రిలీజ్ కు ముందు పాజిటివ్ టాక్ వచ్చిన సినిమాలు అన్నీ ఖచ్చితంగా హిట్ అవుతాయని నమ్మకం లేదు. దీనికితోడు ప్రస్తుతం యంగ్ హీరోయిన్స్ మధ్య తీవ్రపోటీ నెలకొన్న పరిస్థితులలో కీర్తి వాస్తవాలకు దూరంగా అత్యుత్సాహంతో అడుగులు వేస్తోంది అంటూ ఇండస్ట్రీలో కామెంట్స్ వినిపిస్తున్నాయి..

మరింత సమాచారం తెలుసుకోండి: