టాలీవుడ్ లో ఇప్పుడు మోస్ట్ క్రేజియస్ట్ హీరో ఎవరంటే ఠక్కున గుర్తొచ్చే పేరు ప్రభాస్. బాహుబలి సినిమాతో ఈ యంగ్ రెబల్ స్టార్ ప్రపంచ ఖ్యాతి గడించారు. ఈ సినిమా దెబ్బకు ఆయన మార్కెట్ అమాంతంగా పెరిగిపోయింది. ఈయన ఏ సినిమా చేసినా మినిమం 200 నుంచి 300 కోట్లు బడ్జెట్ పెట్టి ఎలాగా మార్కెట్ మారిపోయింది. అయితే ఆయన ఇప్పటికే రెండు సినిమాలు అనౌన్స్ చేశాడు. ఒక సినిమా సెట్స్ మీద ఉంది. అయినా సరే ఆయనతో సినిమాలు చేయడానికి చాలామంది దర్శక నిర్మాతలు క్యూలో ఉన్నారు.

ఆయన కేజిఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తో ఒక సినిమా చేస్తున్నాడని చాలా రోజులుగా ప్రచారం జరుగుతూ వస్తోంది. ఈ ప్రచారం మీద ఎవరూ సరైన క్లారిటీ ఇవ్వకపోవడంతో అది ఒక క్వశ్చన్ మార్క్ గా నిలిచింది. నిన్న కేజిఎఫ్ నిర్మించిన హోంబాల ఫిలిమ్స్ ప్రేక్షకులను మీరు మా కంటే మేము చేసే సినిమాని ఎక్కువ ప్రేమిస్తున్నారని తెలుసు ఆ ప్రేమను మరింత పెంపొందించడానికి మేము మరో పాన్ ఇండియా సినిమా తో మీ ముందుకు వస్తున్నాను డిసెంబర్ 2 మధ్యాహ్నం 2 గంటల 9 నిమిషాలకు ఆ సినిమా అనౌన్స్ చేస్తాం అంటూ ఒక ప్రకటన విడుదల చేసింది.

ఇంకేముంది ఈ సినిమా ప్రశాంత్ నీల్ ప్రభాస్ కాంబినేషన్ లో తెరకెక్కిన ఈ సినిమాను అంటూ సోషల్ మీడియా దద్దరిల్లుతోంది. అయితే ఇక్కడ ఒక విషయాన్ని నెటిజన్లు గమనించకపోవడం గమనార్హం అదేంటంటే ఈ సినిమాని నిర్మిస్తున్నట్లు నిర్మాణ సంస్థ ప్రకటించింది కానీ అది ప్రశాంత్ నీల్ దర్శకుడిగా ఉన్న సినిమానేనా ప్రభాస్ కి సంబంధించిన సినిమానేనా అనేట్లు ఎక్కడా ఇవ్వలేదు. అంటే ఈ సినిమా అసలు ప్రశాంత్ నీల్ దర్శకుడిగానూ సినిమానే కాకపోవచ్చు. కానీ ఫ్యాన్స్ మాత్రం ఈ చిన్న లాజిక్ కూడా మిస్ అయ్యి ప్రభాస్ తోనే సినిమా అంటూ తెగ ఆనందపడి పోతున్నారు. ఒకవేళ రేపు గనక ఈ సినిమా ప్రకటన వారిద్దరిదీ కాదనేది ప్రభాస్ ఫ్యాన్స్ నిరాశలో కూరుకుపోయి ఖాయంగా కనిపిస్తోంది. చూడాలి మరి ఏమవుతుందో ?

మరింత సమాచారం తెలుసుకోండి: