కెజిఫ్ సినిమా ఎంతగా హిట్ అయ్యిందో అందరికి తెలిసిందే. కెజిఎఫ్ సినిమా ముందు హీరో యశ్ అంటే చాలా మంది కి తెలియదు.కానీ కెజిఎఫ్ సినిమాతో దాదాపు గా ఇండియా సినిమా హీరో గా పేరు సంపాదించుకున్నాడు. అలాగే కెజిఎఫ్ సినిమాతో హీరో కె కాక సినిమా దర్శకుడు ప్రశాంత్ నీల్ కూడా మంచి పేరు తెచ్చుకున్నాడు. అలాగే బాహుబలి సినిమా సిరీస్ తో ప్రభాస్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఒక మైలు రాయి గా మిగిలిపోయాడు.


 ఇప్పుడు ప్రేక్షకులను అలరించడానికి కెజిఎఫ్ డైరెక్టర్ తో ప్రభాస్ చేతులు కలపడంతో ఫాన్స్ కు పండగే అని చెప్పవచ్చు.సినిమా కథ ను చెప్పడానికి కెజిఎఫ్ దర్శకుడు హైదరాబాద్ వచ్చి ప్రభాస్ కు కథ కూడా చెప్పడంతో వీరి కాoబో ఫిక్స్ అయ్యినట్లే చెప్పవచ్చు.ప్రస్తుతం ప్రభాస్ మరియు పూజా హెగ్డే కలిసి యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్న రాధే శ్యామ్ సినిమా లో నటిస్తున్నారు. ఈ సినిమా కు రాధ కృష్ణ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు.మరోవైపు ఈ సినిమా తరువాత ప్రభాస్ ఓం రౌత్ దర్శకత్వంలో దాదాపు 400 కోట్ల బడ్జెట్ లో  ఆదిపురుష్ సినిమా చేయనున్నాడు.


అలాగే కెజి ఎఫ్ డైరెక్టర్ దర్శకత్వం లో నటించనున్నారని ప్రచారంలో ఉన్న మహేష్ బాబు, ఎన్టీఆర్, ప్రభాస్ లలో చివరికి ప్రభాస్ తో దాదాపు గా ఖాయం అయ్యిందని తెలుస్తుంది. మరోవైపు ఈ టాలెంటెడ్ డైరెక్టర్ కెజిఎఫ్ పార్ట్ 2 సినిమాలో బిజీగా ఉన్నట్లు తెలుస్తుంది. అనుకున్న సమయo కుదిరితే వీరిద్దరి కాంబో 2021 సంవత్సరం చివరకు లేదా 2022 మొదటి మూడు నేలల్లో ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి. డిసెంబర్ 2 న ఈ సినిమా కు సంభందించి అధికారంగా ప్రకటించనున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: