హార్ట్ ఎటాక్ ఫేం అదా శర్మ కుర్రకారుకు మతిపోగొట్టేస్తోంది. టాప్‌లెస్ ఫొటోషూట్‌తో సెగ పుట్టిస్తోంది. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే అదా శర్మ.. తన అభిమానులను ఎట్రాక్ట్ చేయడానికి ఈ మధ్య ఓ ఫొటో షూట్ చేసింది. అయితే హీరోయిన్‌లు ఫొటో షూట్‌లు చేయడం కొత్తేం కాదు కదా అనుకోకండి. ఎందుకంటే ఆమె చేసిన ఫొటో షూట్ టాప్‌లెస్ ఫొటో షూట్. మల్లెపూలు, గడ్డి పోచలు మాత్రమే అడ్డుపెట్టుకుని అదిరిపోయే ఫోజులిచ్చింది అదాశర్మ.  ఈ ఫోజులను తన ఇన్‌స్టాగ్రాంలో పోస్ట్ చేశారు.

2008లో బాలీవుడ్‌ సినిమా‘1920’తో అదా సినిమాల్లోకి అడుగుపెట్టింది. మొదటి సినిమానే ఆమెకు ఫిలిం ఫేర్ అవార్డు తెచ్చిపెట్టింది. 2014లో టాలీవుడ్‌లోనూ అడుగుపెట్టింది. నితిన్ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ‘హార్ట్ ఎటాక్’లో మెరిసింది. అయితే ఆ తరువాత హీరోయిన్‌గా అవకాశాలు తగ్గడంతో సెకండ్ హీరోయిన్ పాత్రలూ చేసింది. ‘సన్నాఫ్ సత్యమూర్తి’, ‘సుబ్రమణ్యం ఫర్ సేల్’, ‘గరం’ చిత్రాల్లో నటించింది. చివరిగా అడవి శేష్ ‘క్షణం’, రాజశేఖర్ ‘కల్కి’ సినిమాల్లో హీరోయిన్‌గా కనిపించింది. అయితే హీరోయిన్‌గా మంచి గుర్తింపు మాత్రం సంపాదించలేకపోయింది.

టాలీవుడ్‌లో లక్ కలిసిరాకపోవడంతో మళ్లీ ఆమె బాలీవుడ్ వైపు వెళ్లారు. కమాండో వంటి యాక్షన్ చిత్రాల్లోనూ నటించారు. అక్కడ కూడా అంతగా స్టార్ డం సంపాదించలేదు. దీంతో మళ్లీ టాలీవుడ్ వైపే చూస్తున్నారు. ఇప్పుడు ‘క్వశ్చన్ మార్క్ (?)’ అనే థ్రిల్లర్ మూవీతో తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ  సినిమాలో అదా లీడ్‌ రోల్‌లో కనిపించనున్నారు.

ఇదిలా ఉంటే ప్రస్తుతం సోషల్ మీడియాలో అదా శర్మ ఫ్లవర్ టాప్ ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి. ఎదపై నూలుపోగు లేకుండా కేవలం ఓ పూల మాలను మాత్రమే అడ్డం పెట్టుకుని ఆమె ఈ ఫోటో షూట్ చేయడం నెటిజన్ల మతి పోగొడుతోంది. ముఖ్యంగా ఇన్‌స్టాగ్రాంలో ఆమెకున్న మిలియన్ల ఫాలోవర్లకు సెగ పుట్టిస్తున్నాయి. ఈ ఫోటోలు చూసిన ఆమె ఫాన్స్ పండుగ చేసుకుంటున్నారు. ‘అదా మరీ ఇంత బోల్డ్‌గానా..?’ అంటూ కామెంట్‌లు చేస్తున్నారు. మరి హీరోయిన్ అంటే ఆ మాత్రం ఉండాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: