టాలీవుడ్ దర్శక ధీరుడు ఎస్. ఎస్. రాజమౌళి ఇప్పటివరకు తెరకెక్కించిన సినిమాల్లో హై బడ్జెట్ మూవీ ఏదంటే అది "బాహుబలి"సినిమా అనే అంటారు. ప్రభాస్ హీరోగా నటించిన ఈ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుని.. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఓ చరిత్రను సృష్టించింది. ఇప్పటివరకు మరే సినిమా.. బాహుబలి కలెక్షన్లు ని అందుకోలేకపోయిందంటే అతిశయోక్తి కాదేమో.అయితే మళ్ళీ ఆ రేంజ్ ని మించి రాజమౌళి ప్రస్తుతం rrr సినిమాని తీస్తున్నాడు. టాలీవుడ్ స్టార్ హీరోలు ఎన్టీఆర్, చరణ్ లతో ప్లాన్ చేసిన మల్టీస్టారర్ మూవీ దాదాపు 450 కోట్ల బడ్జెట్ తో రూపొందుతోంది. డి.వి.వి.దానయ్య నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమాకి కీరవాణి సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే సినిమా నుండి విడుదలైన హీరోల పరిచయ టీజర్లు యూట్యూబ్లో దుమ్ములేపే వ్యూస్ ని సొంతం చేసుకుని.. ఎన్నో రికార్డ్స్ ని క్రియేట్ చేసాయి.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.  ఈ చిత్రాన్ని కూడా బాహుబలికి సాటిగా నిలబెట్టడానికి రాజమౌళి అహర్నిశలు కృషి చేస్తున్నాడు. లేట్‍ అవుతోందనే కంప్లయింట్‍ వున్నా కానీ రాజమౌళి మాత్రం తన ఆలోచనలు తెరపై కనిపించే వరకు వెనుకాడడం లేదు.ఈ చిత్రం కోసం ఒక భారీ యాక్షన్‍ సీన్‍ని రాజమౌళి పూర్తి చేసాడు. ఈ ఫైట్‍ సీన్‍ కోసం యాభై రోజుల పాటు శ్రమించారు. ఎన్నో కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. అంత ఖర్చుతో, అంతే సమయంలో ఒక మిడిల్‍ రేంజ్‍ సినిమా తీసేసుకోవచ్చట. అంటే సినిమాలో అయిదారు నిమిషాల సన్నివేశం బదులుగా రెండున్నర గంటల సినిమా తీయవచ్చునన్న మాట.దీనిని బట్టి ఈ చిత్రానికి అవుతోన్న ఖర్చెంత, ఒక్కో సీన్‍కీ పడుతోన్న సమయమెంత అనేది అర్థం చేసుకోవచ్చు.

మరి అంత ఖర్చు పెట్టి.. కేవలం ఒక్క సీన్ కోసమే యాభై రోజుల సమయం కేటాయించారంటే.. రేపు సినిమా విడుదలయ్యాక థియేటర్స్ లో ఈ యాక్షన్ సీన్ కి గూస్ బంప్స్ రావడం ఖాయమని చెప్పొచ్చు. ఇక తాజా షెడ్యూల్ కోసం పూణే వెళ్ళింది మూవీ టీమ్. అక్కడ దాదాపు ఓ వారం పాటు షూటింగ్ ఉంటుందని తాజా సమాచారం. ఇక వచ్చే ఏడాది జులై నెలాఖరుకి సినిమా విడుదల చేయగలననే ధీమా రాజమౌళి చూపిస్తున్నా కానీ అది సాధ్యపడే అవకాశం లేదనే వాదనలు ఇప్పుడు ఫిల్మ్ నగర్ లో వినిపిస్తున్నాయి...!!

మరింత సమాచారం తెలుసుకోండి: