టాలీవుడ్లో ప్రస్తుతం కీర్తి సురేష్ యమా బిజీగా ఉన్నారు. ఆమె చేతిలో చాలా సినిమాలున్నాయి. నితిన్తో ‘రంగ్దే’, మహేశ్బాబుతో ‘సర్కారు వారి పాట’ సినిమాల్లో ఆమె హీరోయిన్గా నటిస్తున్నారు. లాక్డౌన్ సమయంలో ఆమె నటించిన రెండు సినిమాలు ఓటీటీ ద్వారా రిలీజై తీవ్రంగా నిరాశ పరిచాయి. దీంతో కొత్త సినిమాలతో మళ్లీ ఫాం అందుకోవాలని కీర్తి అనుకుంటోంది.
ఇదిలా ఉంటే ‘రంగ్దే’ షూటింగ్లో భాగంగా కీర్తి, నితిన్లు దుబాయ్లో ఉన్నారు. అయితే బ్రేక్ టైంలో కీర్తి కూర్చీలో కూర్చుని ఓ కునుకు తీశారు. సరిగ్గా అదే సమయంలో నితిన్ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. షూటింగ్ కోసం తామంతా చెమటలు కక్కుతూ శ్రమ పడుతుంటే.. కీర్తి మాత్రం హ్యాపీగా రిలాక్స్ అవుతోందంటూ నితిన్ ఆ వీడియోకు క్యాప్షన్ ఇచ్చారు.
అయితే ఈ వీడియో నెట్టింట్లో విపరీతంగా వైరల్ కావడంతో కీర్తికి కోపం వచ్చింది. ఇంత పని చేస్తారా..? అంటూ ఓ స్వీట్ వార్నింగ్ ఇచ్చింది. అంతేకాకుండా ఆ ఫోటోను మళ్లీ పోస్ట్ చేస్తూ.. ‘షూటింగ్ సెట్లో ఎప్పుడూ నిద్రపోకూడదని గుణపాఠం నేర్చుకున్నా. పగ తీర్చుకుంటా’ అంటూ కామెంట్ చేసింది. ఈ ఫోటోనే కాకుండా దుబాయ్లోని ఇతర లొకేషన్లలో దిగిన బ్యూటిఫుల్ ఫోటోలను సైతం ఆమె తన ఇన్స్టాలో పోస్ట్ చేసింది.
నితిన్-కీర్తిల రంగ్దే సినిమా లాక్డౌన్ కారణంగా ఆలస్యం అవుతోంది. అయితే ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ సాగుతుండడంతో త్వరలోనే చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.