తెలుగు సినీ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్ ను సొంతం చేసుకుని టాప్ డైరెక్టర్ గా వెలుగొందుతున్న దర్శకుడు రాజమౌళి. భారీ సెట్స్ లతో, సరికొత్త కాన్సెప్ట్ లతో సినిమాలు తెరకెక్కించాలంటే అది కేవలం రాజమౌళి తర్వాతే ఎవరైనా అని అంటుంటారు సినీ నిపుణులు. ఈగ సినిమాతో తన క్రియేటివిటీ ఏంటో అందరికీ తెలియజేశారు రాజమౌళీ. మగధీర, బాహుబలి 1, 2 సినిమాలు తీసి బాక్సాఫీస్ రికార్డులు బద్దలు కొట్టాడు. ఈ మూవీతో డైరెక్టర్ రాజమౌళి అంటే ఒక బ్రాండ్ గా మారారు. అయితే ప్రస్తుతం ఈ దర్శక ధీరుడు "ఆర్ ఆర్ ఆర్" మూవీలో బిజీ బిజీగా గడుపుతున్నారు. ఈ మూవీ ఆయన అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారని చెప్పుకోవచ్చు.


ఇప్పటికే విడుదలైన ఈ మూవీ ట్రైలర్ లోని కొన్ని డైలాగ్స్ చూస్తేనే అర్థం చేసుకోవచ్చు ఈ మూవీ ఏ రేంజ్ లో ఉండబోతోందనేది. కాగా ఈ మూవీలో మెగా పవర్ స్టార్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా నటిస్తున్నారన్న సంగతి తెలిసిందే. ఈ మూవీలో ఈ ఇద్దరు హీరోలుగా షూటింగ్ లో బిజీబిగా గడుపుతున్నారు. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మేజర్ యాక్షన్ సీన్స్ కూడా పూర్తిచేసుకున్నారు. ఈ యాక్షన్ సీక్వెన్సెన్ ఒకటి 50 రోజుల పాటు చిత్రీకరించాడు దర్శకధీరుడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ లో ఎన్టీఆర్, రామ్ చరణ్ ఇద్దరూ బిజీ బిజీగా పాల్గొంటున్నారు. అయితే జానియర్ ఎన్టీఆర్ ఈ మధ్యన ఫ్యామిలీ ట్రిప్ కూడా చేశారని వార్తలు వినిపించాయి.


తన కుటుంబంతో ఎన్టీఆర్ దుబాయ్ వెళ్లి వచ్చారు. ఈ హీరో కొన్ని రోజులు సినిమా షూటింగ్ నుంచి విరామం తీసుకున్నా రామ్ చరణ్ మాత్రం సెలవులు లేకుండా షూటింగ్ లో పాల్గొంటూనే ఉన్నాడు. అయితే ప్రస్తుతం మాత్రం డైరెక్టర్ గారూ నాకు సెలవులు కావాలండీ అని అడుగుతున్నారట. ఈ షూటింగ్ నుంచి అంత అర్జంటుగా సెలవులు తీసుకోవాల్సిన అవసరం ఏమొచ్చిందని అనుకోవచ్చు మరి. దానికి కారణం ఉందండోయ్.. మరి కొన్ని రోజుల్లో మెగా ఫ్యామిలీ ఇంటిలో పెళ్లి బాజాలు మోగనున్నాయిగా.. అందుకే ఈ హీరో సెలవులు అడుగుతున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి.


అయితే మెగా బ్రదర్ నాగబాబు ఏకైక కూమార్తె డిసెంబర్ 9న నిహారిక పెళ్లి ఉంది కదా. అందుకే రామ్ చరణ్ తన చెళ్లి నిహారకి పెళ్లికి హాజరు కావడానికి సిద్ధమవుతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. అందుకే పర్సనల్ రీజన్ తో రామ్ చరణ్ షూటింగ్ నుంచి సెలవులు కావాలని కోరుతున్నారట. అయితే ప్రస్తుతం ఇండస్ట్రీలో అంతా నిహారికా పెళ్లి గురించే చర్చలు జరుగుతున్నాయి. నిహారికా, చైతన్యపెళ్లి డిసెంబర్ 9 న ఉదయంపూర్ కోటలో జరగనుంది. అయితే కరోనాను దృష్టిలో పెట్టుకుని వీరి పెళ్లికి చాలా తక్కువ అతిథులనే ఇన్వైట్ చేసినట్టు తెలుస్తోంది. కేవలం మెగా ఫ్యామిలీ దగ్గరి బందువులు, సినీ ప్రముఖులు మాత్రమే పెళ్లికి హాజరుకానున్నట్టు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: