తెలుగు, తమిళం, మలయాలం సినిమాల్లో నటిస్తూ కెరియర్ పరంగా రయ్ రయ్ మంటూ దూసుకుపోతోంది కథానాయకి కీర్తి సురేష్. కలువ కళ్లతో, బొద్దుగా ఉండే ఈ ముద్దుగుమ్మ సహజమైన నటనతో కుర్రకారు మనసును దోచుకుంటోంది. నేను లోకల్, రెమో సినిమాల ద్వారా కుర్రకారుకు నిద్రలేకుండా చేసింది. వీటితో పాటుగా వరుస సినిమాలతో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది ఈ అందాల రాశి. మహానటి నటి సినిమా ద్వారా ఈ ముద్దుగుమ్మడి లైఫ్ ఓ మలుపు తిరిగింది. ఈ సినిమాతో విమర్శకుల ప్రశంసలు అందుకుందీ ఈ నటి.

మూవీ ఆమెకు ఒక మైలు రాయిగా వర్ణించవచ్చు. అయితే ఈ సినిమా తర్వాత ఈ ముద్దుగుమ్మకు మూవీ ఆఫర్లు క్యూ కట్టాయి. కాని అవేవీ ఆమెకు విజయాన్ని అందించలేకపోయాయి. దానికి కారణం మహానటి సినిమా తర్వాత కీర్తికి కథల ఎంపికలో క్లారిటీ లేకుండా పోయిందని కొందరు సినీ నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. అందుకే వరుస సినిమాల్లో నటించిన విజయాలు మాత్రం అందుకోలేకపోతోందని విమర్శిస్తున్నారు. అయితే లేడి ఓరియెంటెడ్ గా చేసిన పెంగ్విన్ కూడా కీర్తికి అనుకున్నంత పేరును తీసుకురాలేక పోయింది. 

దీనితో పాటుగా తాజాగా వచ్చిన మిస్ ఇండియా కూడా కీర్తికి విజయాన్ని అందించలేకపోయింది. అయితే ఈ సినిమాలో కీర్తి జీరో సైజ్ లో కనిపించి అభిమానులను నిరాశపరిచిందనే చెప్పుకోవచ్చు. ఎంత జీరో సైజ్ లోకి మారిన ఆమె ముఖంలో కళాకాంతులు ఏవీ కనిపించలేదని ఆమె అభిమానులు నిరాశను వ్యక్తం చేశారు. మరీ ముఖ్యంగా అందులోనూ ఆమె నటన ఎవరినీ ఆకట్టుకునేలా లేదని సినీ వర్గాలు అంటున్నాయి. ఈ విషయం పక్కన పెడితే ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ వరుస సినిమాలతో బిజీ బిజీగా ఉంది. ప్రస్తుతం కీర్తి యంగ్ హీరో నితిన్ సరసన ‘రంగ్ దే’ అనే సినిమాలో నటిస్తోంది. 

సినిమా షూటింగ్ ప్రస్తుతం దుబాయ్ లో జరుగుతోంది. అయితే ఈ సినిమా సెట్లో కీర్తి నిద్రపోతున్నట్టు ఉన్న ఒక ఫోటో ఇటీవలె సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. ఈ ఫోటోకు నితిన్ షూటింగ్ లో మాకు చెమటలు పడుతుంటే కీర్తి ఎంత హ్యాపీగా విశ్రాంతి తీసుకుంటోందో చూడండి అంటూ ఫోటోను సోషల్ మీడియాలో పెట్టిన సంగతి తెలిసింది. అది సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుండటంతో కీర్తి దీనిపై తాజాగా స్పందించింది. షూటింగ్ సెట్స్ లో మాత్రం ఎప్పుడూ నిద్ర మాత్రం పోకూడదని తెలుసుకున్నా.. కానీ నితిన్ పై పగ ఖచ్చితంగా తీర్చుకుంటానని కీర్తి కామెంట్ చేసింది . అలాగే ఈ ముద్దుగుమ్మ దుబాయ్ లో షూటింగ్ లో భాగంగా దిగిన ఒక ఫోటోను కూడా అభిమానులతో కీర్తి పంచుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: