బాలీవుడ్ లో కియరా అద్వాని సూపర్ ఫాం లో ఉంది. ఆమె నటిస్తున్న సినిమాలు అక్కడ వరుస హిట్లు కొడుతున్నాయి. మొదట కెరియర్ లో ఫెయిల్యూర్ ఫేస్ చేసిన కియరా ఇప్పుడు అక్కడ వరుస ఛాన్సులు అందుకుంటుంది. కియరా అద్వాని కేవలం హిందీలోనే కాదు తెలుగులో కూడా సినిమాలు చేసింది. తెలుగులో సూపర్ స్టార్ మహేష్ తో భరత్ అనే నేనుతో హిట్ అందుకున్న అమ్మడు రాం చరణ్ తో చేసిన వినయ విధేయ రామ సినిమా ఫ్లాప్ అయ్యింది.

అయితే కియరా అద్వాని మొదటి సినిమా ధోని అనుకుంటారు కాని ఆమె తొలి సినిమా ఫగ్లీ. 2014లో వచ్చిన ఫగ్లీ సినిమా ఆమె చేసింది. అయితే ఆ సినిమా ఫ్లాపై తన ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసిందని చెబుతుంది కియరా. మొదటి సినిమా ఫ్లాప్ అవడంతో తన కెరియర్ అయిపోయినట్టే అనుకున్నానని.. ఆ తర్వాత ఎన్నో ఆడిషన్స్ ఇచ్చినా అవకాశాలు రాలెదని.. ఆ తర్వాత ధోని ఛాన్స్ వచ్చిందని చెప్పింది కీరా అద్వాని. ధోని సినిమాతో కియరా అందరికి దగ్గరైంది.

ఆ తర్వాత లస్ట్ స్టోరీస్ వెబ్ సీరీస్ లో కియరా నటనకు సూపర్ క్రేజ్ వచ్చింది. ఆమె ఇచ్చిన ఎక్స్ ప్రెషన్స్ కు బాలీవుడ్ ఆడియెన్స్ ఫిదా అయ్యారు. అందుకే కియరాకు వరుస అవకాశాలు వస్తున్నాయి. తప్పకుండా కియరా మరో ఐదారేళ్లు హిందీలో అదరగొట్టేస్తుందని చెప్పొచ్చు. తెలుగులో కూడా కియరాకి ఛాన్సులు వస్తున్నా సరే ఆమె మాత్రం బాలీవుడ్ లోనే వరుస సినిమాలు చేస్తుంది. ఇక్కడ కన్నా అక్కడ సినిమాలు చేస్తే అన్నివిధాలుగా క్రేజ్ దక్కుతుందని ఆమె అలా నిర్ణయించుకుంది.                                             

మరింత సమాచారం తెలుసుకోండి: