ప్రస్తుతం స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ సినిమా పుష్ప. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తుండగా, తొలిసారిగా ఈ సినిమా ద్వారా అల్లు అర్జున్ కి జోడీగా రష్మిక మందన్న నటిస్తుండగా రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ దీనికి మ్యూజిక్ అందిస్తున్నారు. ఇప్పటికే లాక్ డౌన్ కి ముందు కొంత భాగం షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా తాజా షెడ్యూల్ ఇటీవల ప్రారంభం అయింది.
పుష్ప రాజ్ అనే మాస్ పాత్రలో అల్లు అర్జున్ నటిస్తున్న ఈ సినిమా గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతుండగా ఈ సినిమాని మాస్ తో పాటు క్లాస్ ప్రేక్షకులను కూడా ఆకట్టుకునే విధంగా ఎంతో జాగ్రత్తగా దర్శకడు సుకుమార్ తీస్తున్నట్లు తెలుస్తోంది. హీరోయిన్ రష్మిక పాత్ర కూడా ఎంతో మాస్ స్టైల్ లో ఉంటుందని, రిలీజ్ తరువాత ఈ సినిమా పక్కాగా సక్సెస్ సాధించడం ఖాయం అని పుష్ప యూనిట్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఎంతో భారీ ఖర్చుతో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం నిర్మాతలు సైతం ఖర్చు విషయంలో ఎక్కడా కూడా వెనుకాడడం లేదట.

ఇకపోతే ఈ సినిమాకి సంబంధించి ప్రస్తుతం పలు ఫిలిం నగర్ వారాల్లో ఒక వార్త విస్తృతంగా చక్కర్లు కొడుతోంది. దాని ప్రకారం వాస్తవానికి ఈ సినిమా కథని మొదట సూపర్ స్టార్ మహేష్ కోసం దర్శకుడు సుకుమార్ రాసుకున్నారని అంటున్నారు. కొన్నాళ్ల క్రితం మహేష్, సుకుమార్ ల కాంబినేషన్ లో ఒక సినిమా రానున్నట్లు వార్తలు రావడం జరిగింది. అయితే తామిద్దరి మధ్య కొంత క్రియేటివ్ డిఫరెన్స్ ల వలన సినిమా చేయడం లేదని మహేష్ అప్పట్లో ఒక పోస్ట్ ద్వారా క్లారిటీ ఇచ్చారు. కాగా ఆ సమయంలో సుకుమార్ మహేష్ కి చెప్పింది పుష్ప మూవీ కథే అని, అయితే అది ఆయనకు నచ్చకపోవడంతోనే అనంతరం అల్లు అర్జున్ ని కలిసిన సుకుమార్, అతడు ఒప్పుకోవడంతో ఫైనల్ గా ఈ కథని సెట్స్ మీదకు తీసుకెళ్లారని అంటున్నారు. మరి ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్తలో ఎంతవరకు వాస్తవం ఉందో తెలియదు గాని, ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియా లో కూడా ఎంతో వైరల్ అవుతోంది.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: