త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన అజ్ఞాతవాసి సినిమా తరువాత కొంత గ్యాప్ తీసుకుని రాజకీయాల్లో బిజీ అయిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మళ్ళి రెండున్నరేళ్ల తరువాత వేణు శ్రీరామ్ దర్శకత్వంలో వకీల్ సాబ్ మూవీ తో పాటు క్రిష్ దర్శకత్వంలో మరొక సినిమా చేస్తున్నారు. కాగా వీటిలో వకీల్ సాబ్ షూటింగ్ తుది దశకు చేరుకుంది. పవన్ కళ్యాణ్ ఒక పవర్ఫుల్ లాయర్ పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో ఆయనకు జోడీగా శృతి హాసన్ నటిస్తోంది. బాలీవుడ్ మూవీ పింక్ కి అఫీషియల్ రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో అంజలి, నివేదా థామస్, ప్రకాష్ రాజ్, సుబ్బరాజు, మురళి శర్మ తదితరులు ఇతర కీలక పాత్రలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

చాలా గ్యాప్ తరువాత వస్తున్న సినిమా కావడంతో పవన్ ఫ్యాన్స్ లో ఈ సినిమాపై ఆకాశమే హద్దుగా అంచనాలు నెలకొని ఉన్నాయి. ఇక ఇటీవల ఈ సినిమా నుండి బయటకు వచ్చిన మగువా మగువా అనే పల్లవితో సాగె లిరికల్ సాంగ్, అలానే ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ రెండూ కూడా ఫ్యాన్స్ ని ప్రేక్షకులను ఆకట్టుకుని వారిలో ఈ సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు క్రియేట్ చేసాయి. ఇకపోతే ఈ సినిమా ఫస్ట్ లుక్ టీజర్ ఈనెల రెండవ వారంలో రానున్నట్లు టాక్. ఇక ఈ సినిమాని వచ్చే ఏడాది సంక్రాంతి పండుగ రోజున రిలీజ్ చేయనున్నారు అంటూ కొద్దిరోజులుగా పలు మీడియా మాధ్యమాల్లో కథనాలు ప్రసారం అవుతున్న విషయం తెలిసిందే. మరోవైపు పవన్ ఫ్యాన్స్ కూడా తమ హీరో సినిమాని కొత్త ఏడాది సంక్రాంతి రోజున చూడవచ్చని ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు.

అయితే లేటెస్ట్ గా కొన్ని టాలీవుడ్ వర్గాల నుండి అందుతున్న సమాచారాన్ని బట్టి ఈ సినిమా షూటింగ్ మరికొంత శాతం బ్యాలన్స్ ఉందని, ప్రస్తుతం ఎన్నికల హడావుడిలో నిమగ్నమై ఉన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, జనవరి మొదటి వారంలో మిగతా భాగాన్ని షూట్ చేద్దాం అని చెప్పినట్లు టాక్. దానిని బట్టి ఈ సినిమా ఫిబ్రవరి తరువాతనే ప్రేక్షకుల ముందుకు వచ్చే ఛాన్స్ ఉందని అంటున్నారు. మరి ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్త కనుక నిజమే అయితే, ఇది నిజంగా పవన్ ఫ్యాన్స్ కి చేదు వార్తే అని చెప్పాలి...!!

మరింత సమాచారం తెలుసుకోండి: