కెజిఎఫ్ సినిమా వచ్చెనంతవరకు కన్నడ సినీ పరిశ్రమను కుటీర పరిశ్రమగా భావించేవారు సినీ లోకం.. అక్కడి సినిమాలు బాగున్నా బడ్జెట్ లు తక్కువ కావడంతో అక్కడి సినిమా లపై ఎవరు అంతగా ఆసక్తి చూపేవారు కాదు.. కానీ కేజిఎఫ్ సినిమా వచ్చిన తరువాత కన్నడ సినిమాలపై అందరి దృష్టిపడింది.. టాలీవుడ్ నుంచి వచ్చిన బాహుబలి సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో  అంతకుమించి క్రేజ్ కేజిఎఫ్ కి ఉంది అనడంలో ఎలాంటి సంకోచం లేదు. కన్నడ నుంచి ఎలాంటి  అంచనాలు లేకుండా వచ్చిఒక్కసారిగా దేశాన్ని ఊపేసింది అని చెప్పొచ్చు.. ఈ సినిమా తో యష్ కూడా ప్రభాస్ లాగే దేశమంతటా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు..

మొదటి భాగం సూపర్ హిట్ కావడంతో సెకండ్ పార్ట్ పై అంచనాలు డబుల్ అయ్యాయి.. పైగా ఈ సినిమా లో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ నటిస్తుండడంతో మొదటి పార్ట్ కంటే ఎక్కువగా ప్రేక్షకులు సెకండ్ పార్ట్ కోసం ఎదురు చూస్తున్నారు..2021 సంక్రాంతికి ఈ సినిమా ని రిలీజ్ చేయాలనీ చూస్తుండగా  కరోనా వల్ల ఆగిపోయిన కేజీఎఫ్ సినిమా షూటింగ్ ఇపుడు మొదలయిపోయింది.  మొన్నటి నుంచి బాలన్స్ షూటింగ్ లో పాల్గొంటున్నాడు యష్. పాన్ ఇండియా లెవెల్ లో క్రేజ్ ఉన్న క్రేజ్ ఉన్న కెజిఎఫ్ 2 లాంటి సినిమాలు వస్తేనే జనాలు ధియేటలకు వస్తారని సినిమా ని కొన్ని రిపైర్లు చేస్తున్నారట..

ఇక ఈ సినిమా పూర్తి కావస్తున్నా నేపథ్యంలో దర్శకుడు ప్రశాంత్హీరో తో సినిమా చేశాడనే ఆసక్తి అందరిలో నెలకొంది. కొంతమంది టాలీవుడ్ హీరోల పేర్లు బయటకి వచ్చినా చివరికి ప్రభాస్ తోనే ప్రశాంత్ సినిమా ఉండబోతుందని అంటున్నారు.. అయితే ఇది ఒట్టి ప్రచారమే అవుతుందని అనిపిస్తుంది. ఎందుకంటే ప్రభాస్ ఇప్పటికే రెండు పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉన్నాడు.. ఈ నేపథ్యంలో ఈ సినిమాలు అయిపోయే వరకు ప్రశాంత్ వెయిటింగ్ లిస్ట్ లో ఉండడం కష్టం.. ఒకవేళ ప్యార్ లాల్ గా చేద్దామన్నా పాన్ ఇండియా సినిమాలు ఒకేసారి మూడు సార్లు చేయడం కష్టం.. సో ఏ లెక్కన చూసినా ప్రభాస్ తో ప్రశాంత్ నీల్ చిత్రం చేయడం చాల కష్టం..

మరింత సమాచారం తెలుసుకోండి: