కమర్షియల్ సినిమాలకు మెసేజ్ ను జోడించి సూపర్ హిట్ కొట్టే దర్శకుడు ఎవరంటే కొరటాల శివ అని టాలీవుడ్ ప్రేక్షకులు ఎవరైనా చెప్తారు. అయన సినిమాల్లో మాస్ ఎలెమెంట్స్ తో పాటు మెసేజ్ కూడా క్యారీ అవుతుంది.. తొలి సినిమా తోనే అయన స్టామినా ఏంటో అందరికి అర్థమైపోయింది.. ప్రభాస్ తో చేసిన మిర్చి ఇద్దరికీ కెరీర్ లో మైలురాయిగా మిగిలిపోయాయి.. రెండో సినిమాగా చేసిన శ్రీమంతుడు టాలీవుడ్ రికార్డులను బద్దలు కొట్టిందని చెప్పొచ్చు.. ఆ తర్వాత వచ్చిన జనతా గ్యారేజ్, భరత్ అనే నేను సినిమాలు కొరటాల శివ ని టాప్ డైరెక్టర్ గా నిలబెట్టాయి..

ప్రస్తుతం ఆయన మెగా స్టార్ చిరంజీవి తో ఆచార్య అనే సినిమా చేస్తున్నారు..  ఈ సినిమా నుంచి ఇటీవలే మోషన్ పోస్టర్ రిలీజ్ కాగా ఈ పోస్టర్ సినిమా పై మంచి అంచనాలు పెంచింది.. మణిశర్మసినిమా కి సంగీతం అందిస్తుండగా హీరోయిన్ గా కాజల్ నటిస్తుంది. కరోనా కారణంగా ఈ సినిమా షూటింగ్ నిలిచిపోగా ఇప్పటివరకు ఈ సినిమా షూటింగ్  ఇటీవలే పున: ప్రారంభం అయ్యింది. ఇటీవలే చిరంజీవి కి కూడా కరోనా సోకడంతో ఓ పదిరోజులు షూటింగ్ ని వాయిదా వేశారు..

ఇక ఈ సినిమా తర్వాత కొరటాల శివ అల్లు అర్జున్ తో సినిమా ని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఫిల్మ్ నగర్‌లో వినిపిస్తున్న గుసగుసల మేరకు... ఈ చిత్రంలో అల్లు అర్జున్‌ ఫస్టాఫ్‌ అంతా ఆంధ్ర విశ్వవిద్యాలయం స్టూడెంట్‌ లీడర్‌గానూ, సెకండాఫ్‌ అంతా రాజకీయ నాయకుడిగా కనిపిస్తాడని సమాచారం.నిజానికి బన్నీ ఇటువంటి పాత్ర ఇప్పటివరకు టచ్‌ చేయలేదు కాబట్టి.. ఇలా పుట్టిస్తున్నారో.. లేదా యూనిట్‌ నుంచి ఏమైనా లీక్‌ అయ్యిందో తెలియదు కానీ.. ప్రస్తుతానికైతే సోషల్‌ మీడియాలో మాత్రం బన్నీ రోల్‌పై రూమర్లు వైరల్‌ అవుతున్నాయి. ఇది అల్లు అర్జున్ నటించే 21వ చిత్రం. అందుకే వర్కింగ్ టైటిల్ కూడా ఏఏ21గా పెట్టారు.

మరింత సమాచారం తెలుసుకోండి: