ఎవడే సుబ్రహ్మణ్యం సినిమా తో టాలీవుడ్ కి పరిచమై తొలి సినిమా తో అభిరుచిగల దర్శకుడు అనిపించుకున్న డైరెక్టర్ నాగ్ అశ్విన్.. అయన రెండో సినిమా చేసిన మహానటి తో దేశమంతటా మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్నారు.. రెండో సినిమా తోనే నేషనల్ అవార్డు గెల్చుకున్న దర్శకుడు బహుశా నాగ్ అశ్వినే కావచ్చు. ఇక మూడో సినిమా గా నాగ్ అశ్విన్ ప్రభాస్ తో పాన్ ఇండియా సినిమా ని చేయబోతున్నాడు. ఈ సినిమా లో దీపికా పదుకొనె నటిస్తుండగా, అమితాబ్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు.. అశ్వని దత్ ఈ భారీ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు

ప్రభాస్ ప్రస్తుతం రాధే శ్యామ్ సినిమా తో బిజీ గా ఉన్నాడు. పూజ హెగ్డే కథానాయిక.. ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకోగా, త్వరలోనే రిలీజ్ డేట్ ప్రకటించే అవకాశం ఉంది. కరోనా కారణంగా ఈ సినిమా రిలీజ్ లేట్ అవుతూ వచ్చింది..కరోనా కారణంగానే ఇప్పటివరకు ఈ సినిమా షూటింగ్ ముందుకు కదల్లేదు.. దాంతో ఆటోమేటిక్ గా సినిమా రిలీజ్ కూడా పోస్ట్ ఫోన్ ఐయ్యింది. అయితే ప్రభుత్వం సడలింపులు నేపథ్యంలో తిరిగి షూటింగ్ లు ప్రారంభించారు.. అయితే రాధేశ్యామ్ సినిమా షూటింగ్ విదేశాల్లో ఉండడంతో ఇప్పటికే వారు అక్కడికి చేరుకొని క్వారంటైన్ లో ఉండి షూటింగ్ ని మళ్ళీ మొదలుపెట్టారు..

ఈ సినిమావస్తే కానీ నాగ్ అశ్విన్ సినిమా మొదలయ్యే పరిస్థితి లేదు.. తాజాగా ఈ సినిమా గురించి ఓ వార్త టాలీవుడ్ లో చక్కట్లు కొడుతుంది.  సైన్స్ ఫిక్షన్ బ్యాగ్ డ్రాప్ లో తెరకెక్కబోతున్న ఈ సినిమాని దాదాపు 500 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. ప్రముఖ సీనియర్ దర్శకులు సింగీతం శ్రీనివాస్ రావు గారు క్రియోటివ్ హెడ్ గా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాలో ముందు నుంచి అమితాబ్ గెస్ట్ రోల్ లో కనిపిస్తారన్న మాట వినిపించింది. కానీ తాజా సమాచారం ప్రకారం అమితాబ్ ది ఈ సినిమాలో ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్ అని తెలుస్తోంది. ప్రభాస్ కి ధీటుగా అమితాబ్ క్యారెక్టర్ ఉండబోతుందట. ఇంచుమించు బాలీవుడ్ లో వచ్చిన థగ్స్ ఆఫ్ హిందుస్థాన్ సినిమాలో మాదిరిగా అమితాబ్ ఫైఋస్ కూడా చేస్తారని సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: