సరిలేరు నీకెవ్వరూ తర్వాత స్టార్ డైరెక్టర్ తో సినిమా చేస్తాడనుకున్న మహేష్ బాబు మళ్ళీ ఓ మీడియం డైరెక్టర్ తోనే ముందుకు వెళ్ళాడు.. అయన 'సర్కార్ వారి పాట' అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. గీత గోవిందం లాంటి క్లాసిక్ హిట్ కొట్టిన పరశురామ్సినిమా కి దర్శకుడు.  సుకుమార్ ని కాదని మరీ చేస్తున్న ఈ సినిమా ఎలాగైనా హిట్ కొట్టాలని మహేష్ బాబు కూడా సినిమా పై ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నాడట.. ఇప్పటికే పూజ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది..

ఇటీవలే ఈ సినిమా ఫస్ట్ లుక్ చాలామందిని ఆకట్టుకుంది.. మహేష్ ని ఇలా మునుపెన్నడూ చూడలేదని విధంగా చూడబోతున్నారట.. ఈ సినిమా కి తమన్ సంగీతం ప్లస్ అవుతుందని అంటున్నారు.. అంతా సవ్యంగా జరిగితే మహేష్ బాబు ఇప్పటికే అమెరికాలో సర్కారు వారి పాట షూటింగ్ మొదలుపెట్టేవాడు. కానీ  కరోనా కారణంగా ఆగిపోయింది..ఈ సినిమా లో హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ ని పరిశీలిస్తుండగా, మహేష్ ద్విపాత్రాభినయం చేస్తుండడం విశేషం.. అప్పుడెప్పుడో చిన్నప్పుడు మహేష్ డబుల్ రోల్ లో నటించాడు.. ఇప్పటివరకు అలా నటించలేదు.. దాంతో ఈ సినిమా ఓ రేంజ్ లో ఉంటుందని అంటున్నారు.

ఇక ఈ సినిమా తర్వాత మహేష్ బాబు ఎదర్శకుడి సినిమా ని ఒప్పుకోలేదు.. త్రివిక్రమ్ తో అనుకున్నా ఫైనల్ కాలేదు.. ఈ నేపథ్యంలో తాను హోల్డ్ లో పెట్టిన పూరి సినిమా ని చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. ఈ ఇద్దరి కాంబినేషన్ లోనే ‘బిజినెస్ మ్యాన్’ పోకిరి సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. ఈ రెండు సినిమాలు అటు మహేష్ బాబు కి ఇటు పూరి చాలా ప్రత్యేకమైన సినిమాలుగా కెరీర్ లో నిలిచిపోతాయి. అయితే మహేష్పూరి కలిసి హ్యాట్రిక్ సినిమా చేయాలనుకున్నారు. ఇందుకోసం ఒక కథ కూడా అనుకున్నాడు పూరి. హ్యాట్రిక్ హిట్ కొట్టాలనుకున్న ఆ సినిమానే ‘జనగణమన’.కొన్ని కారణాలవల్ల ఈ సినిమా ఆగిపోగా ఇప్పుడు అనిల్ సుంకర చొరవ తో మళ్ళీ ఈ సినిమా పట్టాలెక్కనుంది తెలుస్తుంది..

మరింత సమాచారం తెలుసుకోండి: