రోమ్‌లో ఉన్నప్పుడు రోమన్‌లా ఉండాలంటారు. స్విమ్మింగ్‌ఫూల్‌ దగ్గర బికినీతో.. లేదంటే స్విమ్ షూట్‌లో ఉంటారు. కానీ... సమంత మాత్రం డిఫరెంట్‌గా స్టెప్పులేసింది. అందమైన దీవి. అందులో స్విమ్మింగ్‌ ఫూల్‌. కానీ.. ఫుల్‌ డ్రస్‌తో కనిపించింది సామ్‌. ఫొటో పోస్ట్ చేసి 'నో బికిని షూట్‌' అంటూ రాసుకుంది. ఛాన్స్‌  దొరికితే.. గ్లామర్‌ షోతో రెచ్చిపోయే సామ్స్‌ ఎందుకిలా మారిపోయింది.

సమంత ఆ మధ్య నాగచైతన్యతో కలిసి మాల్దీవ్స్‌కు వెళ్లింది. చైతు బర్త్‌డే వేడుకను అక్కడే జరుపుకుంది. మాల్దీవ్స్‌కు వెళ్లిన ముద్దుగుమ్మలు రకుల్‌.. వేదిక.. గ్లామర్‌ గుప్పించారు. కానీ.. సమంత మాత్రం.. దూరంగా వుంది. గ్లామర్‌ ఫొటోలు షేర్‌ చేయడానికి భయపడడానికి కారణం మాత్రం అక్కినేని అభిమానులే.

పెళ్లి తర్వాత సమంత అప్పడప్పుడు గ్లామర్‌ ఫొటోలు షేర్‌ చేసింది. దీంతో ఈ అక్కినేని కోడలిపై.. అభిమానులు మండిపడ్డారు.నాగార్జున పరువు తీస్తోందంటూ.. కామెంట్స్‌ చేశారు. అయినా.. పట్టించుకోని సామ్స్‌.. ఇన్‌స్టాలో అందాలు ఆరబోసింది. అయితే... ఈ సారి ఎందుకోగానీ వెనకడుగు వేసింది. వారం రోజులుగా మాల్దీవ్స్‌లోనే ఉన్నా..  పోస్ట్ చేసిన ఫొటోలతో  ఎక్కడా శృతిమించలేదు సమంత.

గ్లామర్‌గా కనిపించడమంటే సమంతకు మహా ఇష్టం. అందుకే వాటిని సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసేదాకా నిద్రపోయేది కాదు. ఒక్కోసారి ఈ స్టిల్స్‌ శృతిమించేవి. అక్కినేని ఫ్యాన్స్‌ నుంచే కాదు.. చాలామంది నుంచి వస్తున్న విమర్మలను తట్టుకోలేక తలొగ్గింది సామ్స్‌.  చైతు భార్యగా అక్కినేని పరువు నిలిపే ప్రయత్నం కోసం మారిందనుకుంట. మాల్దీవ్స్‌  బీచ్‌లో వారం పాటు విహరించినా.. స్విమ్మింగ్‌ ఫూల్‌లోకి దిగినా.. హీట్‌ ఎక్కించే స్టిల్‌ ఒక్కటీ పోస్ట్ చేయలేదు. యూ టర్న్‌ తీసుకున్న సామ్స్‌.. అక్కినేని ఫ్యాన్స్‌ను మెప్పించేలా మారిపోయింది. మొత్తానికి సమంత అక్కినేని అభిమానుల కోసం యూటర్న్ తీసుకుంది. గతంలో గ్లామర్‌ షోతో సోషల్‌ మీడియాను హీట్‌ ఎక్కించింది సామ్స్‌.. వారం రోజులుగా మాల్దీవ్స్‌లో ఉన్న సమంత
గ్లామర్‌ ఫొటో ఒక్కటీ షేర్‌ చేయలేదు.





మరింత సమాచారం తెలుసుకోండి: