ఏజ్తోపాటు ఎక్స్పీరియన్స్ పెరిగేకొద్దీ చిరంజీవిలో జాగ్రత్తలు కూడా పెరుగుతున్నాయి. ఒకటికి పదిసార్లు నమ్మకం కలిగిస్తేగానీ.. డైరెక్టర్ను ఒకే చేయడం లేదు. మలయాళం మూవీ లూసిఫర్ తెలుగు రీమేక్ రైట్స్ను రామ్చరన్ సొంతం చేసుకున్నాడు. దర్శకుడిగా సుజిత్ను రికమెండ్ చేశాడు నిర్మాత. స్క్రిప్ట్పై దాదాపు ఏడాదిపాటు వర్క్ చేశాడు. చిరంజీవిని శాటిస్ఫై చేయలేకపోవడంతో తప్పుకున్నాడు.
లూసిఫర్ రీమేక్ సుజిత్ చేతుల్లోంచి వినాయక్ దగ్గరకు వచ్చింది. ఠాగూర్, 'ఖైదీ నంబర్ 150' వంటి హిట్స్ ఇచ్చిన వినాయక్కు అప్పజెప్పాడు చిరంజీవి. ముచ్చటగా మూడో రీమేక్తో ఈ కాంబినేషన్ హ్యాట్రిక్ కొట్టాలనుకుంది. చిరంజీవి బెంగుళూరులో ఉంటే అక్కడకు వెళ్లి మరీ స్టోరీ డిస్కషన్స్లో కూర్చున్నాడు వినాయక్. మరేమైందో ఏమోగానీ... లూసిఫర్ మళ్లీ చేతులు మారింది.
పిల్లి పిల్లలను మార్చినట్టు.. లూసిఫర్ దర్శకుల చేతులు మారుతూనే ఉంది. వినాయక్ ప్లేస్లో మోహన్ రాజా వచ్చి చేరాడు. ఎడిటర్ మోహన్ కొడుకైన మోహన్రాజా 2001లో తెలుగు సినిమా హనుమాన్జంక్షన్తో దర్శకుడిగా పరిచయమయ్యాడు. మలయాళ మూవీ 'తెన్పసాని పట్నం' రీమేక్తో తొలి అడుగులో సక్సెస్ చూశాడు. ఆతర్వాత తెలుగులో హిట్టయిన జయం.. అమ్మనాన్న తమిళ అమ్మాయి.. నువ్వొస్తానంటే నేనొద్దంటానాను తమిళంలో రీమేక్ చేసి సక్సెస్ఫుల్ డైరెక్టర్ అయ్యాడు. రామ్చరణ్ నటించిన ధృవ మాతృక 'తని ఒరువన్' తీసింది ఈ దర్శకుడే.
ఆ మధ్య సుజిత్.. నిన్న వినాయక్. ప్రస్తుతం మోహన్ రాజా. దర్శకుల లిస్ట్ చూస్తుంటే.. లూసిఫర్ ఎక్కడ కిచిడి అవుతుందోనన్న భయం అభిమానుల్లో పట్టుకుంది. ఎవరితగ్గట్టు వాల్లు మార్పులు చేసి వెళ్లారు. తెలుగు ఆడియన్స్ పల్స్ పెద్దగా తెలీని మోహన్రాజా డీల్ చేసి చిరంజీవిని మెప్పిస్తాడా? లూసిఫర్లో మోహన్లాల్కు హీరోయిన్ లేదు. అయితే.. తెలుగు రీమేక్లో చిరంజీవి ఇమేజ్కు తగ్గట్టు పాటలతోపాటు.. హీరోయిన్ని పెట్టాలని సుజిత్.. వినాయక్ భావించారట. కానీ.. మోహన్రాజా హీరోయిన్ని వద్దంటున్నాడని టాక్. పాటలు.. స్టెప్పులు లేకుండా.. చిరంజీవి సినిమాను ఫ్యాన్స్ ఊహించుకోలేరు.