మూడు సినిమాలు చేసి ఫెయిల్ అవడంతో నాల్గవ సినిమాపై ఫుల్ ఫోకస్ పెట్టిన అఖిల్ ప్రస్తుతం చేస్తున్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ సినిమాతో ఎలాగైనా సూపర్ హిట్ కొట్టాలని చూస్తున్నాడు. ఈ సినిమాలో పూజా హెగ్దే హీరోయిన్ గా నటించడం కూడా ఓ ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. తను హీరోయిన్ గా చేసే సినిమాల్లో గ్లామర్ షో చేసి ఆడియెన్స్ ను ఎట్రాక్ట్ చేయడంలో పూజా సూపర్ క్రేజ్ తెచ్చుకుంది.

బ్యాచ్ లర్ సినిమాను 2021 సంక్రాంతికి రిలీజ్ చేస్తారని తెలుస్తుంది. ఈ సినిమా తర్వాత అఖిల్ సురేందర్ రెడ్డి డైరక్షన్ లో సినిమా చేస్తాడని తెలుస్తుంది. ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుందని టాక్. సోషియో ఫాంటెసీ కథతో వస్తున్న ఈ సినిమాలో అఖిల్ ఒక్కడు కాదు ఇద్దరుగా కనిపిస్తాడట. అంటే ఈ సినిమాలో అఖిల్ డ్యుయల్ రోల్ చేస్తాడని తెలుస్తుంది. స్టార్ హీరో అవగల స్టామినా, కటౌట్ ఉన్నా సరే సరైన సినిమా పడట్లేదు.

బ్యాచ్ లర్ యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా వచ్చినా సురేందర్ రెడ్డి సినిమా మాత్రం మాస్ ఆడియెన్స్ ను మెప్పించేలా వస్తుందని తెలుస్తుంది. సో అఖిల్ సురేందర్ రెడ్డి మూవీ అక్కినేని ఫ్యాన్స్ కు పండుగ చేసుకునే సినిమా అవుతుందని చెప్పొచ్చు. ఈ సినిమాను అనీల్ సుంకర నిర్మిస్తారని తెలుస్తుంది. సినిమాలో అఖిల్ రెండు పాత్రల్లో డిఫరెంట్ గా చెలరేగిపోతాడని టాక్.                                                                               

మరింత సమాచారం తెలుసుకోండి: