మెగాస్టార్ చిరంజీవి హీరోగా ప్రస్తుతం తెరకెక్కుతున్న సినిమా ఆచార్య. కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మెగాస్టార్ ఒక పవర్ఫుల్ పాత్రలో నటిస్తున్నట్లు టాక్. మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతాన్ని అందిస్తున్న ఈ సినిమాకి తిరు ఫోటోగ్రఫిని అందిస్తున్నారు. లాక్ డౌన్ కి ముందు దాదాపుగా 50 శాతానికి పైగా షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా తదుపరి షెడ్యూల్ ప్రస్తుతం వేగవంతంగా జరుగుతోంది. మెగాస్టార్ తనయుడు రామ్ చరణ్ ఒక కీలక పాత్ర చేస్తున్న ఈ సినిమాలో టాలీవుడ్, బాలీవుడ్ చిత్ర పరిశ్రమలకు చెందిన పలువురు దిగ్గజ నటులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నట్లు తెలుస్తోంది.
కాగా ఈ సినిమాని మంచి మెసేజ్ తో పాటు పలు కమర్షియల్ హంగులు కలగలిపి దర్శకుడు శివ ఎంతో గ్రాండ్ లెవెల్లో తీస్తున్నట్లు టాక్. మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్, కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ సంస్థలు కలిసి ఎంతో భారీ ఖర్చుతో నిర్మిస్తున్న ఈ సినిమాలో మెయిన్ విలన్ గా ప్రముఖ బాలీవుడ్ నటుడు సోను సూద్ నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో ఆయన పాత్ర ఎంతో క్రూరంగా ఉంటుందని, హీరో మెగాస్టార్ క్యారెక్టర్ కి ధీటుగా ఉండేలా దర్శకుడు శివ ఆయన పాత్రని తీర్చిదిద్దారని అంటున్నారు.

ఎప్పుడో కొన్నేళ్ల క్రితం మెగాస్టార్ తో కలిసి నటించానని, మళ్ళి ప్రస్తుతం ఆచార్య ద్వారా ఆయన సినిమాలో ముఖ్య పాత్ర చేయడం ఆనందంగా ఉందని ఇటీవల సోను సూద్ మాట్లాడుతూ చెప్పారు. అయితే ఈ సినిమా సెట్ లోకి తొలిరోజు సోనూ సూద్ ప్రవేశించిన తరువాత పలువురు మూవీ యూనిట్ సభ్యులు ఆయనని ఘనంగా సన్మానించిన విషయం తెలిసిందే. కరోనా కారణంగా ఎన్నో ఇబ్బందులు పడుతున్న పలువురు ప్రజలకు తనవంతుగా సాయం చేస్తూ తోడ్పాటు అందిస్తున్న సోను సూద్ పై పలువురు ప్రజలు కూడా ప్రశంసలు కురిపిస్తున్నారు....!!

మరింత సమాచారం తెలుసుకోండి: