బిగ్ బాస్ సీజన్ 4 లో మంగళవారం ఎపిసోడ్ లో టికెట్ టు ఫినాలే టాస్క్ ఎనౌన్స్ చేశాడు బిగ్ బాస్. ఈ క్రమంలో ఆవు పాల టాస్క్ ఇచ్చి బజర్ మోగిన టైం లో ఎవరిదగ్గర తక్కువ బాటిల్స్ ఉంటాయో వారు ఆ టాస్క్ నుండి తప్పుకున్నట్టు చెప్పాడు. అయితే మొదట్లోనే అవినాష్ ఈ టాస్క్ నుండి బయటకు వచ్చాడు. తనని హౌజ్ మేట్స్ అంతా కలిసి కార్నర్ చేశారని రుసరుసలాడాడు అవినాష్.

ఇక సెకండ్ బజర్ మోగే టైం లో అరియానా ఈ టాస్క్ నుండి బయటకు వచ్చింది. థర్డ్ బజర్ మోగేసరికి మోనాల్ కూడా ఎగ్జిట్ అయ్యింది. ఇక ఫస్ట్ రౌండ్ లో ముగ్గురు బయటకు రాగా మిగిలిన నలుగురు అభిజిత్, హారిక, అఖిల్, సోహెల్ నెక్స్ట్ రౌండ్ కు వెళ్లారు. అయితే ఆట ఆడే విధానం బట్టి చూస్తుంటే అఖిల్, సోహెల్ కలిసి ఆట ఆడినట్టు తెలుస్తుంది. అవినాష్ కూడా అదే విషయాన్ని ప్రస్థావించాడు.

అయితే ఈ ఇద్దరు కూడా టికెట్ టు ఫినాలే ఫైనల్ రౌండ్ కు వెళ్లేలా ఉన్నారు. అయితే అప్పుడు ఇద్దరు తమ ఆట ఆడుతారా లేక స్నేహం కోసం ఒకరికి ఒకరు శాక్రిఫైజ్ చేస్తారా అన్నది చూడాలి. మొత్తానికైతే మొదటి రౌండ్ గెలిచిన వారిలో అభిజిత్, హారిక ఉన్నా తర్వాత రౌండ్స్ లో వారు కూడా బయటకు వచ్చి అఖిల్, సోహెల్ లలో ఒకరికి ఈ టికెట్ టు ఫినాలే మెడల్ లభించేలా ఉందని అనిపిస్తుంది.                                                                

మరింత సమాచారం తెలుసుకోండి: