తెలుగు చిత్ర పరిశ్రమలో ఎందరో కమెడియన్స్ తమ అలరించే నటనతో మన తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. అయితే వారిలో అతి కొద్దిమంది మాత్రం ప్రేక్షకుల గుండెల్లో ఎప్పటికీ చెరిగిపోని గొప్ప ముద్ర వేయడం జరిగింది. కాగా అటువంటి వారిలో ఒకప్పటి కమెడియన్ సుధాకర్ కూడా ఒకరు. టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి కి మంచి మిత్రుడైన సుధాకర్ మొదట్లో పలు తమిళ సినిమాల్లో హీరోగా నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. చిరంజీవి, సుధాకర్, హరిప్రసాద్ ముగ్గరూ సినిమా ఇండస్ట్రీ కి వచ్చిన తొలినాళ్లలో కలిసి ఉండడం జరిగింది. కాగా వారిలో మొదట సుధాకర్ నటుడిగా పరిచయం అయ్యారు.
ఆ తరువాత చిరంజీవి, హరిప్రసాద్ కూడా పలు సినిమాల్లో నటించడం జరిగింది. ఇకపోతే ఇటీవల హరిప్రసాద్ మరణించగా, సుధాకర్ మాత్రం కొన్నేళ్ల నుండి సినిమాలకు దూరంగా ఉంటున్నారు. తమకు మిత్రుడైన చిరంజీవి పలు సందర్భాల్లో తనకు, అలానే హరిప్రసాద్ కి ఎంతో సాయం చేసారని గతంలో పలు సందర్భాల్లో సుధాకర్ వెల్లడించడం జరిగింది. 2017లో తెలుగులో వచ్చిన ఈఈ అనే సినిమాలో చివరిగా నటించిన సుధాకర్, నిన్న జరిగిన భాగ్యనగర మునిసిపల్ ఎన్నికల్లో తన కుమారుడితో కలిసి ఓట్ వేయడానికి వచ్చారు. అయితే ఓట్ వేసిన అనంతరం కుమారుడితో కలిసి పోలింగ్ బూత్ నుండి బయటకు వచ్చిన సుధాకర్ ని చూసిన మీడియా వారు, అలానే అక్కడి కొందరి ప్రజలకు ఒక్కసారిగా దిగ్బ్రాంతి కలిగినట్లు సమాచారం.

ఆయన నడక మరియు శరీర స్థితి చూస్తుంటే ఆయన కొంత అనారోగ్యం పాలైనట్లు చెప్తున్నారు. నిన్న ఉదయం నుండి ఆయన ఫోటోలు, వీడియో పలు మీడియా మాధ్యమాల్లో ఎంతో వైరల్ అవుతున్నాయి. అయితే పూర్తిగా నడవలేంత అనారోగ్యం అయితే ఆయనకు లేదని, కాగా వయసు మీదపడిన రీత్యా ఆయన మునుపటి మాదిరిగా వ్యవహరించలేకపోతున్నారని ఆయన సన్నిహితులు చెప్పినట్లు తెలుస్తోంది. ఏది ఏమైనప్పటికీ ఆ విధంగా సుధాకర్ ని చూసిన పలువురు ప్రేక్షకులు ఆయన బాగా కోలుకుని త్వరలోనే మంచి స్థితికి రావాలని కోరుతూ తమ సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా కామెంట్స్ చేస్తున్నారు......!!


మరింత సమాచారం తెలుసుకోండి: