ఇటీవల తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. సినిమా థియేటర్లు తెరుచుకోవడానికి అనుమతులు ఇస్తున్నట్టు ప్రకటించారు. అంతేకాకుండా, సినిమా టిక్కెట్లను సవరించుకునే వెసులుబాటును కూడా కల్పించారు. అయితే, థియేటర్లు తెరుచుకోవడానికి ప్రభుత్వం పెట్టిన నిబంధనలు యాజమాన్యాలకు అడ్డంకిగా మారాయి. ఎందుకంటే కరోనా వ్యాప్తిని అడ్డుకుంటూ 50 శాతం ఆక్యుపెన్సీతో మాత్రమే థియేటర్లు తెరవాలి. దీంతో ఇప్పటి వరకు తెలంగాణలో ఏ థియేటర్ తెరుచుకోలేదు.అయితే మొదటగా ఏఎంబీ సినిమాస్ డిసెంబర్ 4న తెరుచుకుంటోంది.
సూపర్ స్టార్ మహేష్ బాబు భాగస్వామిగా ఉన్న ఏఎంబీ సినిమాస్ ఒకడుగు ముందుకేసి సినీ ప్రదర్శన మొదలుపెడుతోంది. మంగళవారం నుంచి టిక్కెట్ బుకింగ్ కూడా ప్రారంభించింది. మహేష్ బాబు సతీమణి నమ్రతా శిరోద్కర్ ఒక వీడియో మెసేజ్ను విడుదల చేశారు. ఏఎంబీ సినిమాస్ ప్రకటనతో సినీ ప్రేమికుల్లో ఉత్సాహం వచ్చింది. సినీ ప్రముఖులు కూడా పాజిటివ్గా స్పందిస్తున్నారు. ఈ విధంగా సూపర్ స్టార్ మహేష్ బాబు ముందుకు వచ్చి పలువురికి ఆదర్శంగా నిలిచాడు. ఇలాంటి మరెన్నో మూవీ అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో విశేషాలు తెలుసుకోండి...