త్రివిక్రం డైరక్షన్ లో తారక్ నటించే ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ నటిస్తారని తెలుస్తుంది. అందులో ఒకరు రష్మిక మదన్న కాగా మరో హీరోయిన్ గా కియరా అద్వాని నటిస్తుందని తెలుస్తుంది. ఇద్దరు టాప్ హీరోయిన్స్ ఈ సినిమాలో నటించే ఛాన్స్ ఉందని అంటున్నారు. బాలీవుడ్ లో సూపర్ ఫాం లో ఉన్న కియరా అద్వాని ఆల్రెడీ తెలుగులో మహేష్ తో భరత్ అనే నేను, రాం చరణ్ తో వినయ విధేయ రామ సినిమాలో నటించింది.
హిందీలో వరుస ఆఫర్స్ వస్తున్నాయి కాబట్టి తెలుగులో అవకాశాలు వస్తున్నా కాదంటుంది అమ్మడు. అయితే ఎన్.టి.ఆర్, త్రివిక్రం సినిమాకు మాత్రం డేట్స్ ఇచ్చినట్టు టాక్. ఇక మరో హీరోయిన్ రష్మిక కూడా తెలుగులో సూపర్ ఫాం లో ఉంది. ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప సినిమా చేస్తున్న అమ్మడు ఎన్.టి.ఆర్ తో సినిమా కూడా చేస్తుందని తెలుస్తుంది.