యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ మాటల మాంత్రికుడు త్రివిక్రం ఇద్దరు కలిసి చేస్తున్న సినిమా త్వరలో ఎనౌన్స్ మెంట్ జరుగనుంది. ఈ సినిమాను హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ లో ఈ సినిమా వస్తుంది. ఇక ఈ సినిమాలో ఎన్.టి.ఆర్ సరసన ఇద్దరు ముద్దుగుమ్మలు నటిస్తారని తెలుస్తుంది. అరవింద సమేత సినిమాలో పూజా హెగ్దే హీరోయిన్ గా నటిస్తుంది. రిపీట్ అవుతున్న ఈ కాంబోలో కూడా పూజా హెగ్దేని తీసుకుంటారని అనుకున్నారు కాని ఎన్.టి.ఆర్ సినిమాలో హీరోయిన్ ఛేంజ్ అయినట్టు తెలుస్తుంది.

త్రివిక్రం డైరక్షన్ లో తారక్ నటించే ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ నటిస్తారని తెలుస్తుంది. అందులో ఒకరు రష్మిక మదన్న కాగా మరో హీరోయిన్ గా కియరా అద్వాని నటిస్తుందని తెలుస్తుంది. ఇద్దరు టాప్ హీరోయిన్స్ ఈ సినిమాలో నటించే ఛాన్స్ ఉందని అంటున్నారు. బాలీవుడ్ లో సూపర్ ఫాం లో ఉన్న కియరా అద్వాని ఆల్రెడీ తెలుగులో మహేష్ తో భరత్ అనే నేను, రాం చరణ్ తో వినయ విధేయ రామ సినిమాలో నటించింది.

హిందీలో వరుస ఆఫర్స్ వస్తున్నాయి కాబట్టి తెలుగులో అవకాశాలు వస్తున్నా కాదంటుంది అమ్మడు. అయితే ఎన్.టి.ఆర్, త్రివిక్రం సినిమాకు మాత్రం డేట్స్ ఇచ్చినట్టు టాక్. ఇక మరో హీరోయిన్ రష్మిక కూడా తెలుగులో సూపర్ ఫాం లో ఉంది. ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప సినిమా చేస్తున్న అమ్మడు ఎన్.టి.ఆర్ తో సినిమా కూడా చేస్తుందని తెలుస్తుంది.                                                                              

మరింత సమాచారం తెలుసుకోండి: