స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో భారీ అంచనాలతో వస్తున్న సినిమా పుష్ప. ఈ సినిమా ప్రస్తుతం మారేడుమిల్లిలో షూటింగ్ జరుపుకుంటుంది. అయితే అనూహ్యంగా చిత్రయూనిట్ మొత్తం హైదరాబాద్ షిఫ్ట్ అయినట్టు టాక్. షూటింగ్ కోసం మారేడుమిల్లిలో లాంగ్ షెడ్యూల్ ప్లాన్ చేయగా చిత్రయూనిట్ లో కొందరికి కరోనా లక్షణాలు కనబడ్డాయట. వారికి టెస్ట్ చేయించగా ఫలితాలు పాజిటివ్ గా వచ్చినట్టు టాక్.

అందుకే సినిమా యూనిట్ అంతా హైదరాబాద్ కు షిఫ్ట్ అయినట్టు చెబుతున్నారు. అయితే ఈ వార్తలపై అఫీషియల్ న్యూస్ బయటకు రాలేదు. అయితే త్వరలో నిహారిక మ్యారేజ్ ఉన్న కారణంగా అల్లు అర్జున్ షూటింగ్ కు బ్రేక్ ఇచ్చి ఉండొచ్చని కొందరు అంటున్నారు. ఏది ఏమైనా సుకుమార్ పుష్ప మొదలు పెట్టిన టైం బాగాలేదో ఏమో కాని ప్రతిసారి ఏదో ఒకటి అడ్డుపడుతూనే ఉంది.

పుష్ప సినిమాలో అల్లు అర్జున్ పుష్ప రాజ్ పాత్రలో నటిస్తున్నాడు. ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ తో వస్తున్న ఈ సినిమాలో అల్లు అర్జున్ లారీ డ్రైవర్ గా మాస్ లుక్ తో కనిపిస్తాడని తెలుస్తుంది. రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నారు. మరి ఈ సినిమా షూటింగ్ కు బ్రేక్ పడ్డదని వార్తలు వస్తుండగా మళ్లీ తిరిగి ఎప్పుడు మొదలవుతుందో తెలియాల్సి ఉంది. రంగస్థలం తర్వాత సుకుమార్ చేస్తున్న ఈ సినిమాను పాన్ ఇండియా రిలీజ్ ప్లాన్ చేశాడు. ఈ సినిమాతో అల్లు అర్జున్ మొదటిసారి పాన్ ఇండియా అటెంప్ట్ చేస్తున్నాడు.                                                    

మరింత సమాచారం తెలుసుకోండి: