ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి...టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీ లో చెప్పుకోదగ్గ అపురూపమైన జంటలలో పవర్ స్టార్ రేణు దేశాయ్ జంట కూడా ఒకటి. నిజానికి వీళ్ళు ఎప్పుడో విడిపోయిన కాని ఇప్పటికి చాలా అన్యోన్యంగా ఉంటారు. ఇక అసలు విషయానికి వస్తే మనం చూస్తూ ఉంటాము..సెలబ్రిటీలు సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలు షేర్ చేస్తూ ఉంటారు. ఆ ఫొటోలు ఎంతగానో ఆకట్టుకొని తెగ వైరల్ అయిపోతూ ఉంటాయి. దానికి చాలా కారణాలే ఉండొచ్చు. ఆ ఫొటోలోని పాజిటివ్, నెగిటివ్ అంశాలు.. ఆ ఫొటోను షేర్ చేసిన వ్యక్తి.. ఇవన్నీ ఆ ఫొటో వైరల్ అవడానికి కారణాలు అవుతాయి. తాజాగా మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సతీమణి  రేణు దేశాయ్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఒక ఫొటో కూడా ఇలానే వైరల్ అవుతోంది. దీనికి కారణం ఆ ఫొటో రేణు దేశాయ్ మాజీ భర్త పవన్ కళ్యాణ్‌ది కావడమే.


పవర్ స్టార్  తన పిల్లలు అకీరా, ఆద్యతో కలిసి సరదాగా సంతోషంగా వున్న  ఒక అందమైన ఫొటోను రేణు దేశాయ్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ఇది పాత ఫొటో. పవన్ కళ్యాణ్ గుండెలపై అకీరా, ఆద్య తలపెట్టి నిద్రపోతున్నట్టు ఈ ఫొటోలో కనిపిస్తోంది. దీన్ని అరుదైన క్షణంగా రేణు దేశాయ్ అభివర్ణించారు. ‘‘కొన్ని అందమైన ఫొటోలను షేర్ చేసుకోవాలి. అవి కేవలం మీ ఫోన్‌లో ఫొటో ఆల్బమ్‌లో ఉండిపోకూడదు. కొన్ని అరుదైన క్షణాలను నా ఫోన్ కెమెరాతో నేను స్వయంగా క్యాప్చర్ చేశాను’’ అని రేణు దేశాయ్ తన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో మెన్షన్ చేశారు ..



అంటే, ఈ ఫొటో తన ఫోన్ కెమెరాతో స్వయంగా రేణు దేశాయ్ తీసిన ఫొటో. ఈ అందమైన ఫొటోను షేర్ చేయకుండా రేణు దేశాయ్ ఉండలేకపోయారు. ఈ పాయింట్ ఇప్పుడు పవర్ స్టార్  ఫ్యాన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంటుంది. అందుకే వారు ఈ ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేస్తు తెగ వైరల్ చేస్తున్నారు. కాగా, పవన్ కళ్యాణ్‌ను ప్రేమించి పెళ్లిచేసుకున్న రేణు దేశాయ్.. 2012లో ఆయన నుంచి విడిపోయారు. ఆ తరవాత తన పిల్లలిద్దరితో కలిసి స్వస్థలం పుణే వెళ్లిపోయారు. అక్కడ మరాఠి సినిమాకు దర్శకత్వం వహించారు. అలాగే, మరాఠి సినిమాలను నిర్మించారు. ఇప్పుడు తెలుగులో ఒక సినిమా చేస్తున్నారు.ఇక ఇలా మరెన్నో ఆసక్తికరమైన సినిమా విశేషాలు కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో విషయాలు తెలుసుకోండి...

మరింత సమాచారం తెలుసుకోండి: