సలార్ అంటూ కె.జి.ఎఫ్ డైరక్టర్ ఆ సినిమా నిర్మాతలు కలిసి ప్రభాస్ తో ఓ భారీ సినిమా ప్లాన్ చేశారు. ఇప్పటికే ప్రభాస్ రాధే శ్యాం సెట్స్ మీద ఉండగా బాలీవుడ్ లోనే ఆదిపురుష్ చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత నాగ్ అశ్విన్ సినిమా కూడా లైన్ లో ఉంది. అయితే ఆ సినిమా తర్వాత ప్రశాంత్ నీల్ సినిమా ఉంటుందని తెలుస్తుంది. ప్రశాంత్ నీల్, ప్రభాస్ కాంబోలో సలార్ అంటూ సత్తా చాటనున్నారు.
అయితే ఎన్.టి.ఆర్ తో ప్రశాంత్ నీల్ సినిమా ఉంటుందని అనుకోగా ఆ సినిమా ఏమైందో కాని ప్రభాస్ తో సినిమా ఎనౌన్స్ చేసి బిగ్ షాక్ ఇచ్చాడు ప్రశాంత్ నీల్. అయితే తారక్ సినిమా గురించి మైత్రి మూవీ మేకర్స్ కూడా ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. తప్పకుండా ప్రశాంత్ నీల్ తో ఎన్.టి.ఆర్ సినిమా ఉంటుందని అంటున్నారు. అయితే అది ప్రభాస్ సినిమా అయ్యాక ఉంటుందని తెలుస్తుంది.