ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య సినిమా చేస్తున్న మెగాస్టార్ చిరంజీవి దాని అనంతరం మెహర్ రమేష్ దర్శకత్వంలో వేదాళం మూవీ రీమేక్ తో పాటు వివి వినాయక్ దర్శకత్వంలో మలయాళం మూవీ లూసీఫర్ తెలుగు రీమేక్లో కూడా నటించనున్న విషయం తెలిసిందే. లాక్‌డౌన్‌ కు ముందు ఆచార్య షూటింగ్ 50 శాతం పైగా పూర్తి కాగా ఇటీవల దాని తదుపరి షెడ్యూల్ ప్రారంభమైంది.

మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతాన్ని అందిస్తున్న ఈ సినిమాకి తిరు ఫోటోగ్రఫీని అందిస్తుండగా కాజల్ అగర్వాల్ ఇందులో హీరోయిన్ గా నటిస్తోంది. దేవాలయ భూములు కుంభకోణాల నేపథ్యంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా దర్శకుడు కొరటాల శివ తెరకెక్కిస్తున్న ఈ సినిమా ని మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్, కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ సంస్థలు కలిసి గ్రాండ్ లెవల్లో నిర్మిస్తున్నాయి. చిరంజీవి ఫ్యాన్స్ తో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా దర్శకుడు శివ ఈ సినిమాని తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. అలానే మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ఈ సినిమాలో ఒక కీలక పాత్ర పోషించనున్నట్లు సమాచారం.

ఇకపోతే ఈ సినిమా అనంతరం వెంటనే అటు మెహర్ రమేష్ సినిమాతో పాటు ఇటు వినాయక్ సినిమాలను కూడా ఒకేసారి మొదలు పెట్టనున్న మెగాస్టార్ చిరంజీవి అవి రెండూ పూర్తయిన అనంతరం మాస్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నట్లు లేటెస్ట్ టాలీవుడ్ వర్గాల టాక్. ఇటీవల మెగాస్టార్ ని కలిసి ఒక పవర్ఫుల్ స్టోరి వినిపించిన బోయపాటి అది ఆయనకు ఎంతో నచ్చడంతో ప్రస్తుతం ఆయనకున్న కమిట్మెంట్స్ పూర్తి అయిన అనంతరం దానిని పట్టాలెక్కించేలా ప్రణాళికలు సిద్ధం చేశారట. కాగా టాలీవుడ్ కు చెందిన ఒక బడా నిర్మాణ సంస్థ ఈ సినిమాని నిర్మించనున్నట్లు టాక్. మరి ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్త నిజమైతే తొలిసారిగా మెగాస్టార్ అలానే బోయపాటి కాంబినేషన్లో మంచి మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీని చూడవచ్చు ....!!

మరింత సమాచారం తెలుసుకోండి: