టాలీవుడ్ యాక్టర్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వకీల్ సాబ్ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. పవన్ కళ్యాణ్ పవర్ ఫుల్ లాయర్ పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో ప్రకాష్ రాజ్, అంజలి, నివేదాథామస్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తుండగా తమన్ సంగీతాన్ని పి.ఎస్.వినోద్ ఫోటోగ్రఫీని అందిస్తున్నారు. తొలిసారిగా టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్ కలిసి ఎంతో భారీ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న వకీల్ సాబ్ సినిమా పై పవన్ ఫ్యాన్స్ తో పాటు పలువురు తెలుగు ప్రేక్షకుల్లో కూడా భారీ స్థాయిలో అంచనాలు నెలకొని ఉన్నాయి.
ఇటీవలే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన మగువ మగువ సాంగ్ అలానే ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ రెండు కూడా ప్రేక్షకుల్లో మూవీ పై భారీ స్థాయిలో అంచనాలు క్రియేట్ చేశాయి. ఇప్పటికే తుది దశకు చేరుకున్న ఈ సినిమా షూటింగ్ అతి త్వరలో ముగియనుంది. అలానే ఈ సినిమాని వచ్చే ఏడాది సంక్రాంతి తర్వాత రిలీజ్ చేయనున్నారని అంటున్నారు. ఇకపోతే మరోవైపు తన జనసేన పార్టీ కార్యకలాపాల్లో కూడా పాల్గొంటూ కొనసాగుతున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నేడు తన కూతురు ఆద్యా, అలానే కుమారుడు అకీరా నందన్ లో కలిసి దిగిన ఫోటో ఒకటి నేటి ఉదయం నుంచి పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో ఎంతో వైరల్ అవుతుంది.

తనకి ఎప్పుడైనా ఖాళీ దొరికినప్పుడు ఆద్య, అకీరా లతో కలిసి పవన్ సరదాగా గడుపుతుంటారని, అయితే ఇటీవల మాత్రం ఎక్కువగా వారిని కలిసే సందర్భాలు లేకపోవడంతో చాలా గ్యాప్ అనంతరం నేడు ఆయన వారిద్దరిని కలిశారని ఆ సందర్భంలోనే దిగిన ఫోటో అదనిఅంటున్నారు. ఇక నేటి ఉదయం నుంచి ఆ ఫోటో ఎంతో వైరల్ అవుతుండడంతో పలువురు పవర్ ఫ్యాన్స్ ఆ ఫోటో ని చూసి మరింత ఆనందపడుతున్నారు.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: