కానీ ప్రభాస్ సినిమాలో గెస్ట్ రోల్ లో నటిస్తోన్నందుకు ఏకంగా 22 కోట్లు తీసుకున్నారట..ఇంతకీ ఆ గెస్ట్ రోల్ ని చేస్తున్నది మన బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్. మరి రెమ్యూనరేషన్ కూడా.. ఆయన స్థాయికి తగ్గట్లు ఉండాలి కాబట్టి 22 కోట్లు ఇస్తున్నట్లు తెలుస్తోంది.ఏది ఏమైనా కొన్ని నిముషాల పాత్ర కోసం 22 కోట్లు అంటే.. మాములు విషయం కాదు. ఐతే, ఈ పాత్ర కోసం అమితాబ్ గట్టిగానే డిమాండ్ చేసినట్లు బాలీవుడ్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అందుకే మేకర్స్ కూడా 22 కోట్ల పారితోషికం ఇవ్వడానికి ముందుకు వచ్చారని.. ఎలాగూ నాలుగు వందల కోట్ల రూపాయల బడ్జెట్ మూవీ కావడంతోనే.. అమితాబ్ కి అంత పారితోషికం ఇచ్చారని..
సినిమాకి దీపికా పాత్ర చాలా ఇంపార్టెంట్ అని అందుకే, ఆమెకు కూడా 25 కోట్లు వరకూ ఇస్తున్నారని తెలుస్తోంది. అంత భారీ మొత్తంలో పారితోషకాలు ఇవ్వడం..అది కూడా ఒక క్యారెక్టర్ రోల్ కి అంత భారీ పారితోషికం ఇస్తున్న నిర్మాత అశ్విన్ దత్ ఏ నమ్మకంతో అంత ఖర్చు పెడుతున్నాడో అంటూ అటు టాలీవుడ్ జనాలతో పాటూ ఇండ్రస్టీ లోని పలువురు షాక్ కి గురౌతున్నారు.ఇక ప్రభాస్ నటిస్తున్న రాధే శ్యామ్ సినిమా వచ్చే ఏడాది సమ్మర్ లో విడుదలయ్యే అవకాశం ఉందని ఫిల్మ్ నగర్ లో వార్తలు వినిపిస్తున్నాయి...!!