బాహుబలి సినిమాతో భారీ విజయాన్ని అందుకుని పాన్ ఇండియా స్టార్ గా మారిపోయిన రెబల్ స్టార్ ప్రభాస్.. ఆ తర్వాత భారీ బడ్జెట్ 'సాహో' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కానీ ఆ సినిమా ఆశించిన స్థాయిలో ఫలితాన్ని ఇవ్వలేకపోయింది. అలా అని ప్రభాస్ క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. అదే క్రేజ్ తో ఇప్పుడు వరుస చిత్రాలతో బిజీగా మారిపోయాడమన డార్లింగ్. ప్రస్తుతం ప్రభాస్ రాధాకృష్ణ డైరెక్షన్లో రాధే శ్యామ్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది. ఈ సినిమా తర్వాత  ప్రభాస్ హీరోగా, క్రియేటివ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఓ భారీ ప్రాజెక్ట్ తెరకెక్కనుంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఇటీవలే విడుదలైన సంగతి తెలిసిందే. ఇక వీరి కాంబినేషన్లో రూపొందే సైన్స్ ఫిక్షన్ చిత్రంలో ఓ గెస్ట్ రోల్ ఉంది. అయితే సహజంగా గెస్ట్ రోల్ చేసినందుకు అసలు రెమ్యునరేషన్ తీసుకోరు.

 కానీ ప్రభాస్ సినిమాలో గెస్ట్ రోల్ లో నటిస్తోన్నందుకు ఏకంగా 22 కోట్లు తీసుకున్నారట..ఇంతకీ ఆ గెస్ట్ రోల్ ని చేస్తున్నది మన బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్. మరి రెమ్యూనరేషన్ కూడా.. ఆయన స్థాయికి తగ్గట్లు ఉండాలి కాబట్టి 22 కోట్లు ఇస్తున్నట్లు తెలుస్తోంది.ఏది ఏమైనా కొన్ని నిముషాల పాత్ర కోసం 22 కోట్లు అంటే.. మాములు విషయం కాదు. ఐతే, ఈ పాత్ర కోసం అమితాబ్ గట్టిగానే డిమాండ్ చేసినట్లు బాలీవుడ్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అందుకే మేకర్స్ కూడా 22 కోట్ల పారితోషికం ఇవ్వడానికి ముందుకు వచ్చారని.. ఎలాగూ నాలుగు వందల కోట్ల రూపాయల బడ్జెట్ మూవీ కావడంతోనే.. అమితాబ్ కి అంత పారితోషికం ఇచ్చారని..

సినిమాకి దీపికా పాత్ర చాలా ఇంపార్టెంట్ అని అందుకే, ఆమెకు కూడా 25 కోట్లు వరకూ ఇస్తున్నారని తెలుస్తోంది. అంత భారీ మొత్తంలో పారితోషకాలు ఇవ్వడం..అది కూడా ఒక క్యారెక్టర్ రోల్ కి అంత భారీ పారితోషికం ఇస్తున్న నిర్మాత అశ్విన్ దత్ ఏ నమ్మకంతో అంత ఖర్చు పెడుతున్నాడో అంటూ అటు టాలీవుడ్ జనాలతో పాటూ ఇండ్రస్టీ లోని పలువురు షాక్ కి గురౌతున్నారు.ఇక ప్రభాస్ నటిస్తున్న రాధే శ్యామ్ సినిమా వచ్చే ఏడాది సమ్మర్ లో విడుదలయ్యే అవకాశం ఉందని ఫిల్మ్ నగర్ లో వార్తలు వినిపిస్తున్నాయి...!!

మరింత సమాచారం తెలుసుకోండి: