ఇక శ్రీదేవి చివరి రోజుల్లో కూడా హైదరాబాద్ కి ఓ ఫంక్షన్ కి వచ్చినపుడు తెలుగులో మళ్ళీ నటిస్తాను అని చెప్పుకుంది. ఆమెకు అంత కనెక్షన్ టాలీవుడ్ తో ఉంది. ఆమె కూతురు జాన్వీ మాత్రం టాలీవుడ్ వైపే చూడనంటోంది. నటిగా ఆమె కెరీర్ మొదలెట్టి మూడేళ్ళు అవుతోంది. అయినా ఆమె డైరీలో మాత్రం బాలీవుడ్ మూవీసే ఉన్నాయి. ఇపుడు కూడా వరసగా కమిట్ అవుతున్న సినిమాలు చూస్తే జాన్వీకి టాలీవుడ్ అంటే ఇష్టం లేదా అన్న చర్చ కూడా సాగుతోంది.
అయితే అసలు సమస్య అది కాదుట. జాన్వీకి టాలీవుడ్ లో చేయాలని ఉన్నా ముందు బాలీవుడ్ లో నిరూపించుకోవాలని గట్టిగా ట్రై చేస్తోంది అంటున్నారు. అంతే కాదు తనకు తగిన సబ్జెక్ట్ పడితే మాత్రం టాలీవుడ్ కి ఫ్లేటేసుకుని వచ్చేయడానికి ఎపుడూ రెడీయే అంటోంది. ఇక ఆమెకు మరో ఎమోషనల్ బాండేజ్ కూడా ఉంది. అదేంటీ అంటే తన తల్లి శ్రీదేవి కచ్చితంగా టాలీవుడ్ లో నటించమని చెప్పేదిట.
అందువల్ల తల్లి కోరిక తీర్చేందుకు జాన్వీ రెడీగానే ఉంటుందిట. అయితే ఆ మంచి ముహూర్తం మాత్రం ఇపుడు రాలేదు అంటున్నారు. సరైన సమయం వచ్చినపుడు మాత్రం శ్రీదేవి కూతురు ముంబై నుంచి డైరెక్ట్ గా టాలీవుడ్ కి ఫ్లైట్ కట్టుకుని వాలిపోతుందిట. అంతవరకూ వెయిట్ అండ్ సీ.