ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి మెగా డాటర్  నిహారిక పెళ్లి సందడి షురూ చేసేసింది మెగా ఫ్యామిలీ. నిహారిక- చైతన్య పెళ్లి చేసుకుంటున్న  ముహూర్తానికి వారం ముందు నుంచే సంబరాలు మొదలు పెట్టేశారు. బుధవారం రాత్రి మెగా ఫ్యామిలీ  వారసులంతా ఒక్కచోట కలిసి  నిహారిక, ఆమెకు కాబోయే భర్త చైతన్యకు పెద్ద పార్టీ ఇచ్చారు. ఈ పార్టీలో చిరంజీవి కూతుళ్లు శ్రీజ, సుస్మిత సహా మెగా మేనల్లుళ్లు సాయి ధరమ్ తేజ్, వైష్ణవ తేజ్ తెగ సందడి చేశారట. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కూడా  అవుతున్నాయి.


నిహారిక- చైతన్యలతో మెగా వారసులంతా తెగ ఎంజాయ్ చేశారట. ఈ పెద్ద పార్టీలో వరుణ్ తేజ్, అల్లు అర్జున్ సతీమణి స్నేహ, అల్లు శిరీష్, సాయి ధరమ్ తేజ్, వైష్ణవ తేజ్, కళ్యాణ్ దేవ్, శ్రీజ, సుస్మిత పాల్గొన్నారు. ఈ ఫొటోలను తన సోషల్ మీడియా ఖాతా ద్వారా పంచుకున్నాడు మెగాస్టార్  చిరంజీవి అల్లుడు కళ్యాణ్ దేవ్.. ''చైనిహారిక పెళ్లి సెలబ్రేషన్స్ స్టార్ట్.. ఫ్యామిలీ అంతా కలిసి రాత్రి పార్టీలో ఫుల్ ఎంజాయ్ చేసాం'' అని మెన్షన్ చేశాడు. కాకపోతే ఈ పార్టీలో రామ్ చరణ్, అల్లు అర్జున్ లేకపోవడంతో కొంచెం బాధగా ఉన్నారట మెగా అభిమానులు. ఎందుకంటే వాళ్లిద్దరూ కూడా తమ సినిమా షూటింగ్ లలో బిజీ గా వున్నారు. అందువల్ల పార్టీకి హాజరు కాలేదు...


ఆగస్టు నెలలో నిహారిక- చైతన్య నిశ్చితార్ధ వేడుక జరిగింది. అప్పటి నుంచే ఈ ఇద్దరి ఫోటోలు, పెళ్లి సంగతులు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతూ వస్తున్నాయి. నెట్టింట్లో తెగ సందడి చేస్తున్నాయి. ఇక ఇటీవలే చైతన్య,నిహారిక పెళ్లి డిసెంబర్ 9వ తేదీన రాత్రి 7 గంటల 15 నిమిషాలకు రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లోని ప్యాలెస్‌లో జరగనుందని నాగబాబు చేసిన ప్రకటనతో సినీ లోకమంతా ఈ శుభ ముహూర్తం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. కాగా డెస్టినేషన్ వెడ్డింగ్‌కి సినీ ఇండస్ట్రీ నుంచి కొంతమంది ప్రముఖులు మాత్రమే హాజరు కానున్నారని టాక్. పెళ్లి తర్వాత హైదరాబాద్‌లో గ్రాండ్ సెలబ్రేషన్ ఏర్పాటు చేసి టాలీవుడ్ మొత్తానికి పార్టీ ఇవ్వనుంది మెగా కుటుంబం.ఇక ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన విషయాలు కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి...

మరింత సమాచారం తెలుసుకోండి: