దిల్ రాజు ..అయన ఏది ముట్టుకుంటే అదే బంగారం. సినిమాలో కథను మాత్రమే నమ్మి ముందుకు వెళ్తుంటారు మన రాజు గారు. దిల్ రాజు కి స్టోరీ మీద ఉన్న పట్టు టాలీవుడ్ ఇండస్ట్రీలోనే ఎవరికీ లేదు. అయన జడ్జిమెంట్ అంత బాగుంటుంది అని అందరికి తెలిసిన విషయమే. ఒక సినిమాకు ఎంత మంచి కథ, దర్శకుడు ఉన్న, ఆ కథ దిల్ రాజు లాంటి వారికి చూపిస్తే చాలు ఆ సీనియాకు నిర్మాత దొరికినట్టే. కొత్తవాళ్లను ఇండస్ట్రీ కి తేవడంలోనూ ఆయనకే మంచి రికార్డ్ ఉంది. దిల్ రాజు ఆఫీస్ లో సైతం ఎంతో పెద్ద కథారచయితల టీమ్ ఉంది. ఎలాంటి స్టోరీ కావాలన్న అయన వారితో రాయించుకుంటారు. ఏ కథకు ఎలాంటి హీరో కావాలనేది కూడా అయన ఆచి తూచి ఎంచుకుంటారు. ఇక దిల్ రాజు సెలెక్ట్ చేసిన కథ ఆయన ఎంచుకున్న హీరో కోసమే రాసినట్టు ఉంటుంది.  అందుకే ఆయనకు ఇండస్ట్రీలోనే మంచి సక్సెస్ రేట్ ఉంది.

అస్సలు విషయానికి వస్తే, దిల్ రాజు తేజస్విని అనే అమ్మాయిని ఇటీవలే రెండో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఆమె తాజాగా దిల్ రాజు కి ఒక యూనిక్ స్టోరీ లైన్ ను వినిపించారట. ఆ లైన్ తో ఇంప్రెస్స్ అయిన దిల్ రాజు తన టీమ్ లోని కథా రచయితలకు ఆ స్టోరీ ని డెవలప్ చేయమని సూచించాడట. ఆ స్టోరీ కి సంబందించిన బాధ్యతను సైతం పూర్తిగా తేజస్వినికె అప్పగించాడట. ఈ విషయం టాలీవుడ్ లో ఇప్పుడు తీవ్ర చర్చకు దారి తీస్తుంది. జీవితంలోనే కాదు కథల విషయంలో కూడా తన భర్తకు తోడుగా, చేదోడు వాదోడుగా ఉండటం నిజంగా ఎంతో సంతోషించాల్సిన విషయం. ఇక భార్య కూడా తోడు కావడంతో దిల్ రాజు ఆఫీస్ నుండి ఇంకా మంచి కథలు బయటకు వస్తాయని అంతా అనుకుంటున్నారు. ఇక పోతే ఇంకా కొన్ని రోజుల్లో దిల్ రాజు సినిమాల నిర్మాణం మాత్రమే కాకుండా  వెబ్ సిరీస్ లతో కూడా తన సత్తా చాటాలనుకుంటున్నాడు. ఇక తేజస్విని కథా సినిమాగా  మలిస్తే ఆమె టాలీవుడ్ ఎంట్రీ అయినట్టే అంటున్నారు పరిశీలకులు.  మరి ఆ బాధ్యతలను కూడా తేజస్విని లాంటి యువ మేధస్సుకు అప్పజెప్తే మంచి అవుట్ ఫుట్ వస్తుందని ఆయన భావిస్తున్నారట. ఇప్పటికే దిల్ రాజు కూతురు సైతం అయన ఆఫీస్ విషయాలను జాగ్రత్తగా చూసుకుంటున్నారు. ఇలా ఫ్యామిలి మొత్తం కలిసి బిజినెస్ పై దృష్టి పెట్టడం నిజంగా గ్రేట్ కదా.


మరింత సమాచారం తెలుసుకోండి: