స్వర్గీయులు అక్కినేని నాగేశ్వరరావు గారు, సీనియర్ హీరోయిన్ మీనా ప్రధాన పాత్రల్లో నటించిన ‘సీతా రామయ్యగారి మనవరాలు’ అప్పట్లో ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో అందరికీ తెలిసిందే. నిజానికి ఈ సినిమాలో హీరోగా పృథ్వీని తీసుకోవాలనుకున్నారట దర్వకుడు క్రాంతి కుమార్. సినిమా స్టార్ అవ్వటానికి ముందు పృథ్వీరాజ్ను గడ్డంతో చూసిన ఆయన మెచ్చుకున్నారట. తాను అవకాశాల కోసం తిరుగుతూ షేవింగ్ చేసుకోకపోవడం వల్లే గడ్డం పెరిగిపోయిందని ఆయన చెప్పారట. తన సినిమాలో ఛాన్స్ ఇస్తానని, రేపు లొకేషన్కి రావాలని క్రాంతి కుమార్ చెప్పడంతో పృథ్వీ రాజ్ చాలా ఆనంద పడ్డాడట..
చివరికి ఎలాగోలా ఒక గొప్ప మంచి అవకాశం రావడంతో పృథ్వీ రాజ్ మరుసటి రోజు నీట్గా షేవింగ్ చేసుకుని లొకేషన్కి వెళ్లారట. పృథ్వీని అలా చూసి షాకైన క్రాంతి కుమార్ ఆగ్రహంతో ఊగిపోయారట. నిన్ను షేవింగ్ ఎవరు చేసుకోమన్నారు.. గెటౌట్... అంటూ ఆయన్ని సెట్ నుంచి వెళ్లగొట్టేశారట. తెలియక చేసిన పొరపాటు వల్ల తాను ఓ మంచి అవకాశాన్ని కోల్పోయానని పృథ్వీ రాజ్ ఒకానొక సందర్భంలో తన దురదృష్టాన్ని తలచుకొనిని చాలా
బాధపడ్డారు. గడ్డం తీసేసినందుకు ఓ సూపర్ హిట్ సినిమాలో హీరో ఛాన్స్ కోల్పోవడమంటే దురదృష్టమనే చెప్పాలి. ఏది ఏమైనా వచ్చిన అవకాశం మళ్ళీ పోతే ఆ బాధని వర్ణించలేము. ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన విషయాలు కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో విషయాలు గురించి తెలుసుకోండి....