ఆ సినిమా వల్ల బోయపాటి శ్రీను మెగా అభిమానుల ఆగ్రహానికి గురైన సంగతి తెలిసిందే.. ఇక ఈ చిత్రం నుంచి ఇటీవలే టీజర్ రిలీజ్ కాగా ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది.. ఇందులో పంచెకట్టులో మీసం మెలితిప్పుతూ మాస్ లుక్ లో బాలయ్య అలరించాడు. ఈ సినిమాలో బాలయ్య రెండు విభిన్న పాత్రల్లో కనిపిస్తుండగా.. అందులో ఒకటి అఘోర పాత్ర.. రెండోది ఫ్యాక్షనిస్ట్ పాత్ర అని సమాచారం. ద్వారక క్రియేషన్స్ బ్యానర్ పై యువ నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. థమన్ సంగీతం అందిస్తున్నాడు.
ఇక ఈ సినిమా తర్వాత బాలకృష్ణ చేయబోయే తరువాతి సినిమాపై దృష్టి సారించారు. ఇప్పటికే బి.గోపాల్ తో ఓ ప్రాజెక్టు సెట్ అయ్యింది. ప్రస్తుతం బి.గోపాల్ బాలయ్య కోసం కథ రెడీ చేసుకునే పనిలో ఉన్నారు. ఇప్పుడు శ్రీవాస్ కీ బాలయ్య ఛాన్స్ ఇచ్చేశాడు. శ్రీవాస్ ఇది వరకు బాలయ్యను `డిక్టేటర్`గా చూపించిన సంగతి తెలిసిందే. ఆ సినిమా బాక్సాఫీసు దగ్గర తుస్సుంది. బెల్లంకొండ శ్రీనివాస్ తో భారీగా ఖర్చు పెట్టిన తీసిన `సాక్ష్యం` కూడా ఫ్లాపే. అయినా సరే, బాలయ్య ఛాన్సిచ్చాడట. కోన వెంకట్ ఈ కథని అందించారని, అది… బాలయ్యకు నచ్చిందని, అందుకే ఈ సినిమా ఫైనల్ చేశారని టాక్. సో.. బి.గోపాల్ సినిమా అవ్వగానే, శ్రీవాస్ ప్రాజెక్టు పట్టాలెక్కొచ్చు.