టాలీవుడ్ లో ఇంటలిజెంట్ డైరెక్టర్ గా పేరుతెచ్చుకున్న సుకుమార్ సినిమాలు ఎలా ఉంటాయంటే ఆయన సినిమాలు అర్థం కావాలంటే కొంత తెలివి ఉంటే తప్పా అర్థం కానీ పరిస్థితి.. అయితే ప్రేక్షకులకు అర్థం అయ్యే కన్ఫ్యూషన్ సబ్జెక్టు చేస్తూ మంచి హిట్ లే కొట్టాడు.. ఇటీవలే రంగస్థలం లాంటి క్లీన్ కమర్షియల్ సబ్జెక్టు చేసి రొటీన్ కి భిన్నంగా సినిమా చేసి హిట్ కొట్టాడు.. అయితే పుష్ప సినిమా మొదలయిన దగ్గరినుంచి ఎదో కారణంగా షూటింగ్ పోస్ట్ ఫోన్ అవుతూ వచ్చింది.. తాజాగా మళ్ళీ పుష్ప షూటింగ్ కి బ్రేక్ పడింది..
ఎందుకంటే పుష్ప టీం లో కరోనా కలకలం రేగింది. దీంతో ప్యాకప్ చెప్పేసి టీం అంతా హైదరాబాద్కు వచ్చేయాల్సి వచ్చింది. ఐతే ఒకరిద్దరికి కరోనా వస్తే వాళ్లను ఐసోలేషన్కు పంపించేసి.. సెట్లో శానిటైజేషన్ చేసేసి షూటింగ్ కొనసాగించేవాళ్లే. ఎందుకంటే కోట్ల రూపాయల ఖర్చుతో అక్కడ షూటింగ్కు ఏర్పాట్లు చేశారు. ఇప్పుడు మధ్యలో వదిలేస్తే మళ్లీ కంటిన్యుటీ కష్టమవుతుంది. బ్రేక్ ఇస్తే మళ్లీ కొత్తగా ఏర్పాట్లు చేయాలి. ఖర్చు బాగా ఎక్కువవుతుంది. కాబట్టి కొంతమందికి కరోనా వస్తే షూటింగ్ క్యాన్సిల్ అయ్యేది కాదు.ఐతే ‘పుష్ప’ టీంలో కరోనా బాధితుల సంఖ్య పెద్దదే అని సమాచారం. అందుకే అర్థాంతరంగా షూటింగ్ నిలిపివేయాల్సి వచ్చింది.