కేజిఎఫ్ తో దేశవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న దర్శకుడు ప్రశాంత్ నీల్.. బాహుబలి రాజమౌళి తర్వాత దేశవ్యాప్తంగా మారుమోగిపోయింది ప్రశాంత్ తన తదుపరి సినిమా గా ప్రభాస్ తో సలార్ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.. ఈ విషయం నిన్న అధికారిక ప్రకటన కాగా ఈ సినిమా కోసం ప్రభాస్ ఫాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు.. ఇప్పటికే రాధే శ్యామ్, ఆదిపురుష్, నాగ్ అశ్విన్ సినిమాలను ఒప్పుకుని ఫుల్ బిజీ గా ఉన్న ప్రభాస్ ఇప్పుడు సలార్ సినిమా చేయడం విశేషం.

ఇక ప్రశాంత్ నీల్ కేజిఎఫ్ 2 ను పూర్తి చేసే పనిలో ఉన్నాడు. షూటింగ్ షెరవేగంగా జరుపుతుంటున్న ఈ సినిమా  ఎక్కడా రాజీ పడకుండా భారీ బడ్జెట్ తో తీస్తున్నారు. కోవిడ్ నేపథ్యంలో ఈ చిత్ర షూటింగ్ తిరిగి ప్రారంభమైంది. స్వల్ప విరామం తరువాత హైదరాబాద్ లో ఆఖరి షెడ్యూల్ ప్రారంభం కానుంది. హీరో యష్ - ప్రతినాయకుడు సంజయ్ దత్ పాల్గొనే ఈ షెడ్యూల్ ని డిసెంబర్ చివరికల్లా పూర్తి చేస్తారని తెలుస్తోంది. అయితే తాజాగా ఈ మూవీకి సంబంధించి ఓ వార్త ఫిలిం సర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది.

'కేజీఎఫ్ 2' నుంచి త్వరలోనే ఓ సర్ఫ్రైజ్ రాబోతుందట. జనవరి 8న తేదీన రాకింగ్ స్టార్ యష్ పుట్టిన రోజు సందర్భంగా ఈ చిత్ర టీజర్ విడుదల చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోందట. అందుకు తగ్గట్లే ఏర్పాట్లు కూడా చేస్తుంది.. కేజిఎఫ్ తో అదిరిపోయే రికార్డులను సృష్టించిన ఈ పార్ట్ 2 తో వాటిని తిరగరాయాలని చూస్తుంది. శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీలో బాలీవుడ్ నటి రవీనా టాండన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. రవీ బాస్రుర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. 'కేజీఎఫ్ 2' చిత్రం వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: