ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో టాలీవుడ్ బడా స్టార్స్ అయిన మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ లు కలిసి నటిస్తున్న సినిమా రౌద్రం రణం రుధిరం. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఈ సినిమాలో కొమరం భీం పాత్ర పోస్తిస్తుండగా రామ్ చరణ్ అల్లూరి సీతారామరజుగా కనిపించనున్నారు. ఇక ఇద్దరు హీరోల పరిచయ టీజర్స్ ఇటీవల యూట్యూబ్ లో రిలీజ్ అయి సూపర్ రెస్పాన్స్ దక్కించుకున్నాయి. ఈ సినిమాలో ఆలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్స్ గా నటిస్తుండగా సముద్రఖని, అజయ్ దేవగన్, శ్రియ, రాహుల్ రామకృష్ణ తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు.

ఇక ఈ సినిమాపై కేవలం మన దేశంలోని ప్రేక్షకుల్లోనే కాక పలు ఇతర దేశాల ప్రేక్షకుల్లో కూడా భారీ స్థాయిలో అంచనాలు నెలకొని ఉన్నాయి. కీరవాణి ఈ సినిమాకి సంగీతాన్ని అందిస్తుండగా సాయి మాధవ్ బుర్రా మాటలు, విజయేంద్ర ప్రసాద్ కథని అందిస్తున్నారు. ఇప్పటికే చాలావరకు షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా వచ్చే ఏడాది వేసవి తరువాత ప్రేక్షకుల ముందుకు రానున్నట్టు టాక్. ఇక ఈ సినిమాని అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా పలు కమర్షియల్ హంగులు కలగలిపి దర్శకడు రాజమౌళి ఎంతో అత్యద్భుతంగా తెరకెక్కిస్తున్నట్లు టాక్. పలువురు హాలీవుడ్ నటులు ఇందులో విలన్స్ పాత్రలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమా వాస్తవానికి ఈ ఏడాది జులై 30న రిలీజ్ కావాల్సి ఉండగా, విజువల్ ఎఫెక్ట్స్ వర్క్ పెండింగ్ ఉన్న కారణంగా సినిమాని వచ్చే ఏడాది జనవరి 8కి వాయిదా వేశారు.

మధ్యలో కరోనా కారణంగా విధించిన లాక్ డౌన్ వలన ఈ సినిమా మరికొన్ని నెలలు వాయిదా పడింది. ఇక లేటెస్ట్ గా కొన్ని టాలీవుడ్ వర్గాల నుండి మా ఏపీ హెరాల్డ్ సంస్థకు అందుతున్న సమాచారాన్ని బట్టి ఆర్ఆర్ఆర్ సినిమా వచ్చే ఏడాది వేసవి తరువాత రిలీజ్ కానుందని, అలానే దానికి సంబందించిన రిలీజ్ డేట్ అనౌన్స్ మెంట్ సరిగ్గా నూతన సంవత్సరం రోజున అనగా జనవరి 1, 2021న ఉంటుందని అంటున్నారు. మరి ఈ వార్తే కనుక నిజం అయితే ఆర్ఆర్ఆర్ కోసం ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న ఫ్యాన్స్ కి ఇది మంచి పండుగ వార్తే అని చెప్పాలి....!!

మరింత సమాచారం తెలుసుకోండి: