సైన్స్ అండ్ టెక్నాలజీ అభివృద్ధి చెందుతూ ఆండ్రాయిడ్, స్మార్ట్ ఫోన్ల కాలానికి వచ్చేసరికి పలు రకాల సేవలు మాత్రమే కాకుండా చాలా విషయాలను మరీ ముఖ్యంగా వ్యక్తుల మధ్య దూరాన్ని కూడా ఈ పెరుగుతున్న టెక్నాలజీ అందరికీ దగ్గర చేసింది. రోజురోజుకూ సామాజిక మాధ్యమాల వినియోగం అంతకంతకూ పెరుగుతోంది. ముఖ్యంగా సమాచార సేకరణకు సామాజిక మాధ్యమాలే ప్రధాన మార్గం అయ్యాయి. ఈ మేరకు ఈ తరం సెలబ్రిటీలంతా తమ తమ సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా అందరితో టచ్‌లో ఉంటున్నారు. ఎప్పటికప్పుడు పోస్టులు పెట్టేస్తూ తమ తమ అప్‌డేట్స్ ఇస్తున్నారు. ఇంకొందరైతే తమ పోస్టులతో డబ్బు సంపాదన కూడా చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఇదే అదునుగా మరోవైపు హ్యాకర్స్ కూడా తమపని తాము చేసుకుంటూ సినీ నటులు మరియు వీఐపీల పాపులర్ సోషల్ మీడియా ఖాతాలను టార్గెట్ చేస్తుండటం చూస్తూనే ఉన్నాం.



తాజాగా హీరోయిన్ వరలక్ష్మి శరత్ కుమార్ తన సోషల్ మీడియా అకౌంట్స్ ఇన్‌స్టాగ్రామ్, ట్విట్ట‌ర్ హ్యాక్ అయ్యాయని తెలిపింది. ''నిన్న రాత్రి నుంచి నా రెండు అకౌంట్స్ యాక్సిస్ చెయ్యలేకపోతున్నాను. అవి హ్యాక్ అయ్యాయని తెలిసింది. మీడియాతో పాటు నా ఫాలోవ‌ర్స్‌ అందరికీ ఓ రిక్వెస్ట్.. నా అకౌంట్స్ నుండి ఎలాంటి మెసేజెస్ వ‌చ్చినా కూడా రియాక్ట్ కాకండి. అంతా చాలా అప్రమత్తంగా ఉండండి. వీలైనంత త్వరలో నా రెండు అకౌంట్స్ తిరిగి పొందే ప్రయత్నం చేస్తా. రికవరీ అయిన వెంటనే మళ్లీ మీకు సమాచారం అందిస్తాను'' అని పేర్కొంది వరలక్ష్మి శరత్ కుమార్. ఇక తమిళంలో పాటు తెలుగు సినీ పరిశ్రమలో వరుస అవకాశాలు పట్టేస్తున్న వరలక్ష్మి శరత్ కుమార్.. ప్రస్తుతం రవితేజ హీరోగా రూపొందుతున్న 'క్రాక్' సినిమాలో ముఖ్యపాత్ర పోషిస్తోంది. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: