టాలీవుడ్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇటీవల అజ్ఞాతవాసి సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇక దాని అనంతరం వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న వకీల్ సాబ్ ద్వారా రెండున్నరేళ్ల గ్యాప్ తరువాత మళ్ళి సినిమాల్లోకి కం బ్యాక్ ఇవ్వడానికి సిద్దమైన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దానితో పాటు క్రిష్ దర్శకత్వంలో మరొక సినిమా కూడా చేస్తున్నారు. కాగా వకీల్ సాబ్ లో లాయర్ గా నటిస్తున్న పవన్, క్రిష్ సినిమాలో వజ్రాల దొంగగా పండగల సాయన్న అనే పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది.

వకీల్ సాబ్ ని దిల్ రాజు, బోనీ కపూర్ నిర్మిస్తుండగా క్రిష్ సినిమాని మెగాసూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఏ ఎం రత్నం నిర్మిస్తున్నారు. ఇకపోతే వీటిలో వకీల్ సాబ్ చాలావరకు షూటింగ్ పూర్తి చేసుకోగా క్రిష్ సినిమా లాక్ డౌన్ కి ముందు రెండు షెడ్యూల్స్ జరుపుకుంది. ఇక ఇటీవల వకీల్ సాబ్ లేటెస్ట్ షెడ్యూల్ హైదరాబాద్ లో జరుగగా, తదుపరి చివరి షెడ్యూల్ ని జనవరి మొదటి వారంలో ప్లాన్ చేసినట్లు టాక్. అయితే వకీల్ సాబ్ వాస్తవానికి ఈపాటికి పూర్తి కావలసి ఉండగా, ఇటీవల తెలంగాణాలో జిహెచ్ఎంసి ఎలక్షన్స్, అలానే ఆంధ్రలో వర్షాల వల్ల పంట నష్టపోయిన రైతుల పరామర్శ వంటి పలు కార్యక్రమాలు పెట్టుకున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ఆ కార్యక్రమాల్లో నిమగ్నమై ఉండడంతోనే వకీల్ సాబ్ షూటింగ్ వాయిదా పడినట్లు చెప్తున్నారు.

మరోవైపు ఈ సినిమా ఫస్ట్ లుక్ టీజర్ ఈ నెల చివరిన, అలానే సినిమా సంక్రాంతి రోజున రిలీజ్ అవుతుంది అంటూ కొద్దిరోజులుగా పలు మీడియా మాధ్యమాల్లో వార్తలు ప్రచారం అవుతున్నాయి. మరి వకీల్ సాబ్ ఎప్పటికి షూటింగ్ పూర్తి చేసుకుని థియేటర్స్ లోకి వస్తుందో తెలియాలి అంటే మరికొద్దిరోజులు ఆగాల్సిందే అంటున్నారు విశ్లేషకులు.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: