ప్రస్తుతం ప్రభాస్ అల్ ఇండియా స్టార్ గా చక్రం తిప్పుతున్నాడు.ప్రస్తుతం ఉన్న సౌత్ హీరోలలో ఏ హీరోకి లేని క్రేజ్ ప్రభాస్ సొంతం చేసుకున్నాడు.దీంతో ఆయన సినిమాలన్నీ కూడా భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా చిత్రాలుగా తెరకెక్కుతున్నాయి. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ వరుస సినిమా లైనప్ చూసి ఆయన అభిమానులు ఫుల్ జోష్ లో ఉన్నారు.అయితే "సలార్" అంటూ దర్శకుడు ప్రశాంత్ నీల్ తో ప్రభాస్ ఒక సినిమా చేస్తున్నట్లు తాజాగా ప్రకటించారు.

 ఈ సినిమా లో ప్రభాస్ గెటప్ మరియు యాటిట్యూడ్ కి సంబంధించి దర్శకుడు ప్రశాంత్ నీల్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభాస్ తో కలిసి పని చేసేందుకు ఎంతో ఉత్సాహంతో ఎదురు చూస్తున్నానని..ఎంతో థ్రిల్ కి గురి అవుతున్నా అని తెలిపారు. యాక్షన్ చిత్రాన్ని ప్రేక్షకులకు అందించేందుకు మేము సిద్దం అవుతున్నాం అని అన్నారు.సలార్ గా మీరు ఇప్పటి వరకు చూడని ప్రభాస్ ను ఒక కొత్త అవతారం లో చూస్తారు అంటూ ప్రశాంత్ నీల్ చెప్పుకొచ్చారు.

అయితే ఆ కొత్త ప్రభాస్ అభిమానులందరికీ కచ్చితంగా నచ్చుతాడు అని తెలిపారు.కేజీఎఫ్ చిత్రం తో యశ్ లుక్ ను మాత్రమే కాకుండా, కన్నడ సినీ పరిశ్రమ ఫేట్ ను కూడా మార్చేశారు ప్రశాంత్ నీల్. అయితే ఈ చిత్రానికి సీక్వెల్ కూడా పూర్తి అయినట్లు తెలుస్తోంది. అయితే ప్రభాస్ రాధే శ్యామ్ చిత్రం తరువాత,వెంటనే సలార్ చిత్రాన్ని జనవరిలో మొదలు పెట్టనునట్లు అధికారిక ప్రకటన కూడా ఇచ్చారు. .ఇప్పటికే ప్రభాస్ మరో రెండు భారీ సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.మరి ప్రభాస్ రాధే శ్యామ్ చిత్రం తరువాత ఏ సినిమాను మొదలు పెడతాడో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: