సరిగ్గా రెండేళ్ల క్రితం కన్నడ సూపర్ స్టార్ యాష్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో హోంబలే ఫిలిమ్స్ బ్యానర్ పై తెరకెక్కిన ప్రతిష్టాత్మక పాన్ ఇండియా సినిమా కే జి ఎఫ్ చాప్టర్ 1. అత్యంత భారీ బడ్జెట్ తో అత్యున్నత సాంకేతిక విలువలతో తెరకెక్కిన ఈ సినిమాలో శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటించింది. కన్నడ సహా పలు ఇతర భారతీయ భాషల్లో రిలీజ్ అయిన ఈ సినిమా రిలీజ్ అనంతరం అత్యద్భుత విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే.

ఇటీవలే ఈ సినిమాకి సీక్వెల్ గా కే జి ఎఫ్ చాప్టర్ 2 షూటింగ్ ప్రారంభం అయి ప్రస్తుతం తుది దశకు చేరుకుంది. మొదటి భాగాన్ని మించేలా మరింత భారీ ఖర్చుతో గ్రౌండ్ లెవెల్ లో దర్శకనిర్మాతలు తెరకెక్కిస్తున్న ఈ సినిమా పై దేశ విదేశాల్లో ఉన్న ప్రేక్షకుల్లో భారీ స్థాయిలో అంచనాలున్నాయి. ఇకపోతే ఈ సినిమా తర్వాత రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా సలార్ సినిమాని అనౌన్స్ చేశారు దర్శకుడు ప్రశాంత్ నీల్. హోంబలే ఫిలిమ్స్ సంస్థ ఎంతో భారీ ఖర్చుతో నిర్మించనున్న ఈ సినిమా షూటింగ్ వచ్చే ఏడాది జనవరిలో ప్రారంభం కానుంది. ఇకపోతే దీని తర్వాత టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై ప్రశాంత్ నీల్ ఒక సినిమా చేయనున్నారని ఇటీవల కొన్నాళ్ల నుండి పలు మీడియా మాధ్యమాల్లో వార్తలు ప్రచారం అవుతున్నాయి.

వాస్తవానికి సలార్ కంటే ముందే ఈ సినిమా పట్టాలెక్కాల్సి ఉందని అయితే ఎన్టీఆర్ కాల్షీట్స్ ప్రస్తుతం బిజీగా ఉన్నందువల్ల అంతకంటే ముందు ప్రశాంత్ నీల్ ప్రభాస్ తో సినిమా చేయడానికి సిద్ధమయ్యారని అంటున్నారు. ఇకపోతే ఎన్టీఆర్ తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబుతో కూడా ప్రశాంత్ నీల్ ఒక సినిమా చేయనున్నట్లు టాక్. ఇప్పటికే వీరిద్దరి కాంబో సినిమాకు సంబంధించి కూడా కథని రాస్తున్న ప్రశాంత్ నీల్ దానిని ఒక బడా నిర్మాణ సంస్థ ఆధ్వర్యంలో చేయనున్నట్లు సమాచారం. ప్రభాస్, ఎన్టీఆర్ సినిమాల అనంతరం ఈ సినిమా ఉంటుందని అంటున్నారు. మొత్తంగా చూసుకుంటే రెబల్ స్టార్, యంగ్ టైగర్, సూపర్ స్టార్లతో ఏకంగా మూడు భారీ ప్రాజెక్ట్స్ ని ప్రశాంత్ నీల్ లైన్లో పెట్టినట్లు తెలుస్తోంది.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: