బిగ్ బాస్ సీజన్ 4లో టికెట్ టు ఫినాలే థర్డ్ లెవల్ లో ఊయలలో సోహెల్, అఖిల్ లను కూర్చోమని ఆ ఊయల నుండి ఎవరు కిందకు దిగితే వారు టాస్క్ ఓడినట్టు. ఎవరు చివరి వరకు ఉంటారో వారు గెలిచినట్టు అంటాడు. ఈ క్రమంలో గురువారం మొత్తం ఉదయం నుండి ఆ ఊయల మీద ఉన్న సోహెల్, అఖిల్ గంటలు గడుస్తున్నా కొద్దీ వాళ్లలో ఇబ్బంది మొదలైంది. ఇక శుక్రవారం ప్రోమోలో టాస్క్ ముగిసే టైం కు ఇద్దరు బోరున ఏడ్చేసినట్టు తెలుస్తుంది.

టాస్క్ లో చివరి వరకు ఉన్నా ఎవరో ఒకరు గెలవాల్సి ఉంటుంది. అయితే అప్పటివరకు ఉన్నా సరే ఎవరు గిదక పోయే సరికి బిగ్ బాస్ ఇద్దరిలో ఎవరు దిగకపోతే ఎవరికి ఆ టికెట్ టు ఫినాలే మెడల్ తగ్గదని అంటాడు. సో ఆ లెక్క ప్రకారం చూస్తే సోహెల్ మరోసారి అఖిల్ కోసం త్యాగం చేశాడని తెలుస్తుంది. అయితే ఈ టైం లో సోహెల్, అఖిల్ ఊయలలో బోరున ఏడ్చారు. అంతేకాదు ఊయల దిగేసి ఈ టాస్క్ సంచాలకుడిగా ఉన్న అభిజిత్ ను హగ్ చేసుకుని కూడా బాధపడ్డారు.

చూస్తుంటే ఎవరో ఒకరు త్యాగం చేయాలన్న కాన్సెప్ట్ లో వారిద్దరి మధ్య వాదులాట జరిగి ఉండొచ్చని తెలుస్తుంది. ఫైనల్ గా బిగ్ బాస్ సీజన్ 4లో టికెట్ టు ఫినాలే రేసులో ఎవరు ఫస్ట్ ఫైనల్ పార్టిసిపెంట్ అయ్యాడు అన్నది రేపు తెలుస్తుంది. సో ఈ రెండు వారాలు ఆ మెడల్ గెలిచిన వారు రిలాక్స్ అవ్వొచ్చన్నమాట.                                                      


మరింత సమాచారం తెలుసుకోండి: