తెలుగు చలనచిత్ర పరిశ్రమకి అక్కినేని మూడు తరాల హీరోలైన ఏఎన్నార్, నాగార్జున, నాగచైతన్య కలిసి నటించిన మనం సినిమా ద్వారా నటి గా ఎంట్రీ ఇచ్చింది రాశిఖన్నా. విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో నాగచైతన్యకు ప్రేయసి గా రాశి ఖన్నా ఒక చిన్న పాత్ర పోషించారు. ఆ తర్వాత అవసరాల శ్రీనివాస్ దర్శకత్వంలో నాగ శౌర్య హీరోగా తెరకెక్కిన ఊహలు గుసగుసలాడే సినిమా ద్వారా హీరోయిన్ గా మారింది రాశి ఖన్నా. ఇక రిలీజ్ అనంతరం ఆ సినిమా మంచి సక్సెస్ ని అందుకుని హీరోయిన్ గా రాశి కి మంచి పేరు తెచ్చిపెట్టింది.

ఇక ఆ తర్వాత నుంచి మెల్లగా ఒక్కొక్కటిగా అవకాశాలు అందుకుంటూ కొనసాగిన రాశిఖన్నా ఆ పై ఎన్టీఆర్ తో జై లవకుశ, రవితేజ తో  టచ్ చేసి చూడు, సాయిధరమ్ తేజ తో సుప్రీం, రామ్ తో హైపర్, అలాగే ఇటీవల వరుణ్ తేజ్ తో తొలిప్రేమ వంటి సినిమాల్లో నటించి మంచి పేరు సంపాదించింది. ఇక గత ఏడాది ఆమె నటించిన ప్రతి రోజు పండగే, వెంకీ మామ సినిమాలు బాగా సక్సెస్ సాధించి హీరోయిన్ గా ఆమెకు మరిన్ని అవకాశాలు తెచ్చిపెట్టాయి. అయితే ప్రస్తుతం రాశి కన్నా తెలుగు కంటే ఎక్కువ తమిళ సినిమాలతో బిజీగా ఉంది. అందుతున్న సమాచారాన్ని బట్టి ఇటీవల ఆమె రెండు తెలుగు సినిమాలు ఓకే చేసిందని అతి త్వరలో వాటికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్ మెంట్స్ కూడా రానున్నాయని సమాచారం.

ఇకపోతే ఎప్పటికప్పుడు తన సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా అభిమానులకు అలానే ప్రేక్షకులకు అందుబాటులో ఉండే రాశి కన్నా ఇటీవల లాక్ డౌన్ సమయంలో పలు ఫోటోలు వీడియోలు పోస్ట్ చేసి ఫ్యాన్స్ లో మంచి జోష్ నింపింది. ఇకపోతే నేడు ఆమె ఆరెంజ్ కలర్ డ్రెస్ లో అదిరిపోయే స్టైల్ లో దిగిన ఫోటోలు ప్రస్తుతం పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. రాశి ఎంతో ఇష్టపడి ప్రత్యేకంగా దిగిన ఈ ఫోటో షూట్ ని ఒక ప్రముఖ ఫోటోగ్రాఫర్ నిర్వహించినట్లు టాక్. ఇక ఈ ఫోటోలను చూసిన పలువురు ఆమె అభిమానులు అలానే నెటిజన్లు అబ్బబ్బబ్బా రాశి నీ అందంతో మమ్మల్ని అందరినీ చంపేసావ్ పో అంటూ ఆమె పై సరదాగా తమ సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా కామెంట్స్ చేస్తున్నారు.....!!


మరింత సమాచారం తెలుసుకోండి: