పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినీ రీ ఎంట్రీ తరువాత వరుస సినిమాలను ఒప్పుకుంటున్నాడు.తన కెరియర్ లో ఎప్పుడు లేని విధంగా వరుసగా నాలుగు సినిమాలను లైన్లో పెట్టారు పవర్ స్టార్.తాజాగా మరో క్రేజీ ప్రాజెక్ట్ ను లైన్లో పెట్టడాని సోషల్ మీడియాలో ఓ వార్తా విపరీతంగా చక్కర్లు కొడుతుంది..దక్షిణాదిలో ఒక టాప్ మోస్ట్ డాన్స్ కొరియోయోగ్రాఫర్ అయినటువంటి జానీ మాస్టర్ ఒక స్టోరీ లైన్ చెప్పి పవన్ ను ఒప్పించడాని సమాచారం.

 జానీ మాస్టర్ పవన్ కల్యాణ్ కు వీరాభిమాని అన్న సంగతి తెలిసిందే.అయితే ఇందులో మరో విశేషం.. ఈ సినిమాను రాంచరణ్ నిర్మించబోతున్నాడట.తన కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ లో ఈ చిత్రాన్ని చరణ్ టేకప్ చేస్తాడు అని గాసిప్స్ మొదలయ్యిపోయాయి.రాంచరణ్ కు జానీ మాస్టర్ కు కూడా మంచి సన్నిహిత్యం ఉంది. అయితే ప్రస్తుతం పవన్ కల్యాణ్. అటు రాజకీయాలతో వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు.మరి ఈ సినిమాను పవన్ ఎప్పుడు పట్టలేకిస్తాడన్నది ఆసక్తికరం.

రాంచరణ్ ఎప్పటి వరకు తన నాన్న గారి సినిమాలను మాత్రమే నిర్మించారు.ఈ సినిమా నిజమే అయితే తన బాబాయి తో మొదటి సారి సినిమా నిర్మించినట్టే.ఇంతకీ ఈ సినిమా నిజమేనా అన్నది కూడా ప్రశ్నార్థకమే..ఏదిఏమైనప్పటికి ఈ ముగురి కాంబినేషన్ మాత్రం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: