ఇక ఎన్టీఆర్ - ప్రశాంత్ నీల్ మధ్యన కథ చర్చలు, లంచ్ పార్టీ కూడా జరిగినట్లుగా సోషల్ మీడియా కోడై కోసింది. కానీ తర్వాత ఎందుకో ప్రభాస్ లైన్ లోకి వచ్చాడు. ప్రశాంత్ నీల్ తో ప్రభాస్ లో టచ్ లో ఉన్నాడనే న్యూస్ నడుస్తుండగానే..ప్రభాస్ - ప్రశాంత్ నీల్ కాంబో సలార్ పాన్ ఇండియా మూవీ ప్రకటన వచ్చి ఎన్టీఆర్ ఫాన్స్ కి షాకిచ్చింది.అసలు ఎన్టీఆర్ ని వదిలి ప్రశాంత్ నీల్ ప్రభాస్ కి ఎలా కనెక్ట్ అయ్యాడో అంటూ ఎన్టీఆర్ ఫాన్స్ సోషల్ మీడియాలో గగ్గోలు పెడుతున్నారు. అసలు ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ ని ఎందుకు పక్కనబెట్టాడో ఫాన్స్ కి అర్ధం కావడం లేదు.
అయితే ఎన్టీఆర్ కి ప్రశాంత్ నీల్ సలార్ కథ చెప్పినప్పటికీ.. ఎన్టీఆర్ కి కథ నచ్చకపోవడంతో అది హోల్డ్ లో ఉంచాడని, ప్రశాంత్ నీల్ అదే కథ తో ప్రభాస్ చేత కమిట్ చేయించాడని ఇపుడు ఇండస్ట్రీలో హాట్ హాట్ గా చక్కర్లు కొడుతున్న న్యూస్. ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ కి కథ చెప్పగా.. ఇంకా డెవెలెప్ చెయ్యమని, అందులో మార్పులు చెయ్యమని చెప్పాడని.. కానీ తన కథ మీదున్న నమ్మకంతో ప్రభాస్ కి కథ వినిపించి ప్రశాంత్ నీల్ ఓకె చేయించుకున్నాడనే టాక్ మొదలైంది.అలా ఎన్టీఆర్ కి చెప్పిన కథ ప్రభాస్ కు నచ్చడంతో ఈ ప్రాజెక్ట్ కన్ఫర్మ్ అయ్యింది...!!