కె.జి.ఎఫ్ సినిమాతో దర్శకుడిగా మంచి క్రేజ్ ని దక్కించుకున్నాడు కన్నడ డైరెక్టర్ ప్రశాంత్ నీల్. ఆ సినిమా దాదాపు అన్ని భాషల్లో విడుదలై ఘన విజయం సాధించడంతో ప్రశాంత్ నీల్ పేరు ప్రపంచ వ్యాప్తంగా మారు మ్రోగిపోయింది. ఆ డైరెక్టర్ తో పనిచేయాలని ముఖ్యంగా మన తెలుగు అగ్ర హీరోలు ఎక్కువ ఆసక్తిని చూపారు.అలాగే ప్రశాంత్ నీల్ కూడా టాలీవుడ్ స్టార్స్ తోనే సినిమా చేయడానికి ఫిక్స్ అయ్యాడు. ఈ నేపథ్యంలో తన నెక్స్ట్ మూవీ ఎన్టీఆర్ తోనే అని తారక్ ఫ్యాన్స్ ఫిక్స్ అయిపోయారు. దానికి ఓ కారణం ఉంది. అదేంటంటే "ఎన్టీఆర్ కి ప్రశాంత్ నీల్ బర్త్ డే విషెస్ చెప్పడం, ప్రశాంత్ నీల్ కి ఎన్టీఆర్, మైత్రి మూవీస్ వారు విషెస్ చెప్పడం, ఎన్టీఆర్ ని ప్రశాంత్ నీల్ టైగర్ అనడంతో వాళ్ళ కాంబోలో మూవీ పక్కా అని ఎన్టీఆర్ ఫాన్స్ ఫిక్స్ అయ్యారు.

ఇక ఎన్టీఆర్ - ప్రశాంత్ నీల్ మధ్యన కథ చర్చలు, లంచ్ పార్టీ కూడా జరిగినట్లుగా సోషల్ మీడియా కోడై కోసింది. కానీ తర్వాత ఎందుకో ప్రభాస్ లైన్ లోకి వచ్చాడు. ప్రశాంత్ నీల్ తో ప్రభాస్ లో టచ్ లో ఉన్నాడనే న్యూస్ నడుస్తుండగానే..ప్రభాస్ - ప్రశాంత్ నీల్ కాంబో సలార్ పాన్ ఇండియా మూవీ ప్రకటన వచ్చి ఎన్టీఆర్ ఫాన్స్ కి షాకిచ్చింది.అసలు ఎన్టీఆర్ ని వదిలి ప్రశాంత్ నీల్ ప్రభాస్ కి ఎలా కనెక్ట్ అయ్యాడో అంటూ ఎన్టీఆర్ ఫాన్స్ సోషల్ మీడియాలో గగ్గోలు పెడుతున్నారు. అసలు ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ ని ఎందుకు పక్కనబెట్టాడో ఫాన్స్ కి అర్ధం కావడం లేదు.

అయితే ఎన్టీఆర్ కి ప్రశాంత్ నీల్ సలార్ కథ చెప్పినప్పటికీ.. ఎన్టీఆర్ కి కథ నచ్చకపోవడంతో అది హోల్డ్ లో ఉంచాడని, ప్రశాంత్ నీల్ అదే కథ తో ప్రభాస్ చేత కమిట్ చేయించాడని ఇపుడు ఇండస్ట్రీలో హాట్ హాట్ గా చక్కర్లు కొడుతున్న న్యూస్. ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ కి కథ చెప్పగా.. ఇంకా డెవెలెప్ చెయ్యమని, అందులో మార్పులు చెయ్యమని చెప్పాడని.. కానీ తన కథ మీదున్న నమ్మకంతో ప్రభాస్ కి కథ వినిపించి ప్రశాంత్ నీల్ ఓకె చేయించుకున్నాడనే టాక్ మొదలైంది.అలా ఎన్టీఆర్ కి చెప్పిన కథ ప్రభాస్ కు నచ్చడంతో ఈ ప్రాజెక్ట్ కన్ఫర్మ్ అయ్యింది...!!

మరింత సమాచారం తెలుసుకోండి: