బాలక్రిష్ణ నాలుగు దశాబ్దాల నుంచి అలరిస్తున్న నటుడు. బాలక్రిష్ణ డిఫరెంట్ జోనర్లలో సినిమాలు చేసి ఆడియన్స్ ని మెప్పించారు. తండ్రి ఎన్టీయార్ వారసుడిగా ఇండస్ట్రీలో ప్రవేశించినా  కూడా తనదంటూ ఒక స్టైల్ ఏర్పాటు చేసుకుని ముందుకు సాగుతున్నారు. బాలయ్య ప్రస్తుతం బోయపాటి శ్రీను డైరెక్షన్ లో హ్యాట్రిక్ మూవీ చేస్తున్నారు.

మూవీ తరువాత బాలయ్య చేయబోయే సినిమా మీద కూడా క్లారిటీ వచ్చేసింది. బాలయ్య శ్రీవాస్ డైరెక్షన్ లో తరువాత సినిమాకు కమిట్ అయ్యారని అంటున్నారు. ఈ మూవీకి ప్రముఖ రచయిత కోన వెంకట్ కధను ఇచ్చారని అంటున్నారు. దాన్ని చూసిన బాలయ్య ఓకే చెప్పేశారు అని కూడా అంటున్నారు.

వచ్చే ఏడాది మార్చి కి బోయపాటి మూవీ కంప్లీట్ అవుతుంది. ఆ తరువాత సెట్స్ మీదకు వెళ్ళబోయే సినిమా ఇదేనని అంటున్నారు. ఇప్పటికే శ్రీవాస్ డైరెక్షన్ లో బాలయ్య డిక్టేటర్ పేరుతో పవర్ ఫుల్ సినిమా చేశాడు. ఆ సినిమాలో బాలయ్య రోల్ కి మచి పేరు వచ్చింది. ఇక ఈ ఇద్దరి కాంబోలో ఇది రెండవ సినిమా. లౌక్యం వంటి మంచి ఎంటర్టైనర్ ని ఇచ్చిన శ్రీవాస్ బాలయ్యతో ఈసారి సూపర్ హిట్ ఇవ్వాలని పట్టుదల మీద ఉన్నారని టాక్.

సినిమా తరువాత చూసుకుంటే సీనియర్ డైరెక్టర్ బీ గోపాల్ డైరెక్షన్ లో బాలయ్య మరో సినిమా చేస్తారని అంటున్నారు. ఈ ఇద్దరిదీ కూడా హిట్ కాంబినేషన్. మళ్ళీ రెండు దశాబ్దాల తరువాత కలుస్తున్నారు. ఈ రెండు మూవీస్ అయ్యేటప్పటికి 2022 వచ్చేస్తుంది. మరి అపుడు ఏమైనా పూరీ జగన్నాధ్ తో మూవీ ఉంటుందేమో చూడాలి కానీ ఈ మధ్యలో మాత్రం లేదని అనేస్తున్నారు. మరి బాలయ్యను పూరీ పైసా వసూల్ లో చాలా కొత్తగా చూపించాడు. దాంతో బాలయ్య ఫ్యాన్స్ కూడా ఫిదా అయ్యారు. కానీ ఇపుడు పూరీ కాంబో వెనక్కి వెళ్తుంది అంటే వారు ఎలా రియాక్ట్ అవుతారో.



మరింత సమాచారం తెలుసుకోండి: