నిన్నటి తరం నటి అశ్విని చాల మందికి గుర్తుండే ఉంటుంది. వందకు పైగా తెలుగు చుత్రాల్లో నటించిన అశ్విని తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో దాదాపు 150 సినిమాల్లో నటించారు. 80, 90, లలో అశ్విని హీరోయినిగా  చలామణి అయ్యింది. అశ్విని సొంత వూరు నెల్లూరు. సినిమా ఛాన్సుల కోసం చెన్నై కి వెళ్లి అక్కడే సెటిల్ అయ్యింది. నటుడు, దర్శకుడు పార్తీబన్ ఆమెను మొదటగా పొండాటి తేవై అనే సినిమాతో తమిళ ఇండస్ట్రీ కి పరిచయం చేయగా, ఆమె ఆయనతో అనేక సినిమాలో నటించింది.  ఒక్క సినిమాలే కాదు సినిమా అవకాశాలు తగ్గాక తమిళ సీరియల్స్ లో సైతం నటించింది. అశ్విని కేవలం 43 ఏళ్ళ వయసులోనే కన్ను మూసింది. ఇక ఆమెను తెలుగు బుల్లి తెరపై మరి కొద్దీ రోజుల్లో కనిపించే క్రమంలో ఆమె గుండె పోటుకు గురయ్యిది.

ఇక ఆమె వ్యక్తి గత విషయానికి వస్తే ఆమె తెలుగు తెలుగు సినీ దర్శకుడిని ప్రేమించి పెళ్లి చేసుకున్న అశ్విని కి ఒక కుమారుడు కార్తీక్ సైతం ఉన్నాడు. కానీ ఏవో కారణాల చేత భర్తతో కలిసి జీవించని అశ్విని ఒంటరిగానే జీవించింది. కానీ ఆమెకు సినిమా అవకాశం ఇచ్చిన పార్తీబన్ తో ఆమెకు మంచి అనుబంధం ఉండేది. అశ్విని కన్ను మూయడానికి ముందే క్యాన్సర్ తో ఆరోగ్యం దెబ్బ తిన్నది. భర్త లేక చిన్న బాబుతో అశ్విని ఎన్నో కష్టాలు పడింది. చివరకు తాను శ్వాస వదిలేసే సమయంలో తన కొడుకు కార్తీక్  ని పార్తీబన్ చేతిలో పెట్టి కన్ను మూసింది. ఇక ఈ పార్తీబన్ మరెవరో కాదు హీరోయిన్ సీత భర్త. ఇక పార్తీబన్ కొడుకు ఇప్పుడు పార్తీబన్ దగ్గర పెరిగి పెద్దయ్యాడు, మంచి ప్రయోజకుడు అయ్యాడు. పార్తీబన్ కుమార్తెల పెళ్లిళ్లకు దగ్గరుండి అన్ని పనులు చూసుకున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: