ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి...సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్ లోనే "పోకిరి" సినిమా ఒక పెద్ద మైల్ స్టోన్...పూరి జగన్నాధ్‌, మహేష్‌బాబు కాంబినేషన్లో వచ్చిన  ఈ మాస్టర్ పీస్ బాక్సాఫీసు వద్ద రికార్డులన్నిటిని బద్దలు కొట్టి అద్భుతమైన విజయం  సాధించిన సంగతి తెలిసిందే. 2006, ఏప్రిల్‌ 28న విడుదలైన  ఈ చిత్రం అప్పటివరకు ఉన్న తెలుగు సినిమా ఇండస్ట్రీ రికార్డులన్నీ చెరిపేసింది. ఈ సినిమాలో  మహేష్‌కు జోడీగా హాట్  బ్యూటీ ఇలియానా తన అందచందాలతో మెప్పించింది.తన రెండవ సినిమానే సూపర్ స్టార్ మహేష్ బాబు తో నటించి స్టార్ హీరోయిన్ అయిపోయింది.తరువాత వరుసగా ఎన్టీఆర్ ప్రభాస్ లాంటి స్టార్ హీరోస్ తో నటించింది. మంచి డిమాండ్ సంపాదించుకుంది...

అయితే పోకిరి సినిమాలో  ముందుగా ఇలియానా హీరోయిన్ గా  కాకుండా మరో హీరోయిన్‌ను అనుకున్నారట. ఆమె ఎవరో కావు బాలీవుడ్ ఫైర్ బ్రండ్ హాట్ బ్యూటీ కంగనా రనౌత్. ఈ సినిమా ఆడిషన్స్‌ ముంబయిలో జరుగుతున్న సమయంలో అక్కడే బాలీవుడ్ చిత్రం ‘గ్యాంగ్‌స్టర్’ ఆడిషన్స్ కూడా జరుగుతున్నాయట. ఇందులో పాల్గొనడానికి వచ్చిన కంగనా.. పనిలో పనిగా ‘పోకిరి’ ఆడిషన్స్‌లో కూడా పాల్గొన్నదట.

అయితే కంగనా అదృష్టమో, దురదృష్టమో తెలియదు కానీ రెండు సినిమాల్లోనూ ఒకేసారి అవకాశం వచ్చిందట. దీంతో రెండింటిలో ఏదో ఒకటి ఎంచుకోవాల్సిన పరిస్థితి రావడంతో కంగనా బాలీవుడ్‌ సినిమాకే మొగ్గు చూపించిందట. దీంతో ఈ ఛాన్స్ ఇలియానాకు దక్కింది. బాలీవుడ్‌ స్టార్ హీరోయిన్‌గా ఎదిగిన కంగనా.. పూరీ, ప్రభాస్ కాంబినేషన్లో ‘ఏక్ నిరంజన్’ సినిమాలో నటించింది. ఆ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోలేక ప్లాప్ అయింది.ఇక ఆ తరువాత కంగనా టాలీవుడ్ వంక చూడలేదు. పూర్తిగా బాలీవుడ్ పైనే దృష్టి పెట్టింది... ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి...

మరింత సమాచారం తెలుసుకోండి: