అంతేకాదు సరిలేరు నీకెవ్వరు సినిమా తో టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా మారిపోయింది రష్మిక మందన్న. అయితే ప్రస్తుతం వరుస అవకాశాలు అందుకుంటూ స్టార్ హీరోల సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిపోయింది రష్మిక మందన్న. ప్రస్తుతం టాలీవుడ్ లో బిజీ బిజీగా ఉన్న హీరోయిన్లలో ఒకరిగా ఉంది. మరోవైపు సోషల్ మీడియాలో తన ఫోటోలను పోస్ట్ చేస్తూ ఎప్పటికప్పుడు అభిమానులు అలరిస్తూనే ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. ఇకపోతే రష్మిక మందన్న మరో బంపర్ ఆఫర్ కొట్టేసింది అని ప్రస్తుతం సోషల్ మీడియాలో టాక్ వినిపిస్తోంది.
ఆచార్య సినిమా కోసం రష్మిక మందన ను కలెక్ట్ చేసిందట చిత్ర బృందం. మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆచార్య సినిమాలో ఇప్పటికే మెగాస్టార్ సరసన కాజల్ అగర్వాల్ సెలెక్ట్ అయింది అన్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమాలో స్టూడెంట్ నాయకుడిగా రామ్ చరణ్ కూడా ఒక కీలక పాత్ర పోషిస్తున్నాడు. అయితే చరణ్ పాత్ర సినిమాకి కీలకంగా మారనుంది అన్న విషయం తెలిసిందే. ఇక రామ్ చరణ్ సరసన నటించే హీరోయిన్ ఎవరిని సెలెక్ట్ చేస్తారు అనే దానిపై క్లారిటీ రాలేదు. ముందుగా కియారా అద్వానిని తీసుకునేందుకు ప్రయత్నించినప్పటికీ డేట్లు ఖాళీ లేకపోవడంతో... ఇక ప్రస్తుతం రష్మిక మందన ని సంప్రదించారట చిత్రబృందం. రష్మిక కూడా దీనికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఆచార్య సినిమాలో రష్మిక కనిపించబోతునట్లు సమాచారం.